Home » “లైగర్” సినిమా మొత్తం అవేనా….? తెలుగు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారా..?

“లైగర్” సినిమా మొత్తం అవేనా….? తెలుగు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారా..?

by AJAY
Ad

పూరి జగన్నాథ్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. హీరోలకు అభిమానులు ఎలా ఉంటారో పూరికి సైతం అదేవిధంగా అభిమానులు ఉంటారు. పూరి సినిమా వచ్చిందంటే కచ్చితంగా థియేటర్లోనే చూడాలని వెయిట్ చేసే ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. పూరి కూడా తన సినిమాను మినిమం ఉండేలా చూసుకుంటాడు. తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేసి బ్లాక్ బస్టర్ అందుకుంటాడు.

Advertisement

అంతేకాకుండా సినిమాలో కథ బలంగా లేకపోయినా ప్రేక్షకులకు బోర్ కొట్టనివ్వడు. ముఖ్యంగా పూరి సినిమాలు ఎక్కువగా యూత్ కు కనెక్ట్ అవుతుంటాయి. హీరోని స్టైలిష్ గా చూపించడం … పవర్ఫుల్ డైలాగులు కొట్టించడం పూరి స్టైల్ లోని ప్రత్యేకత. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ తో టైగర్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఉండడంతో పాటు కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. పూరి విజయ్ కాంబో కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. అంతేకాకుండా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఆరు పాటలతో పాటు ఏడు ఫైట్ సీన్లు ఉండబోతున్నాయట.

నిజానికి లైజర్ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో మైక్ టైసన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కాగా సినిమాలో ఏడు ఫైట్లు అంటే అసలు తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా లేదా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి తెలుగు ఆడియన్స్ కు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమే…. కానీ రింగ్ లో చేసే కిక్ బాక్సింగ్ ప్రేక్షకులకి నచ్చుతుందా లేదా అని విశ్లేషకులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading