Home » పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై స్పందించిన నటుడు శివాజీ.. ఏం అన్నారంటే?

పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై స్పందించిన నటుడు శివాజీ.. ఏం అన్నారంటే?

by Srilakshmi Bharathi
Ad

బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు 14 రోజుల రిమాండ్ విధించి, అతన్ని చంచల్ గూడా జైలుకి తరలించారు. బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ గా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్.. అనూహ్యరీతిలో ఆట ఆడి టైటిల్ గెలిచారు. అయితే.. ఫైనల్స్ అయిపోయాక, జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్ అభిమానులకు, రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ అభిమానులకు మధ్య గొడవ అయ్యింది.

Advertisement

ఈ గొడవలో పలువురు కంటెస్టెంట్స్ కార్ల అద్దాలను పగలగొట్టారు. అంతే కాకుండా.. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా పగలగొట్టారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను అరెస్ట్ చేసారు. అంతే కాకుండా.. పల్లవి ప్రశాంత్ ను కూడా అదుపులోకి తీసుకుని సుమోటోగా కేసు నమోదు చేసారు. ఈ ఘటనపై తాజాగా నటుడు శివాజీ స్పందించారు.

శివాజీ మాట్లాడుతూ.. పల్లవి ప్రశాంత్ చాలా మంచి వాడు అని.. ఇలాంటి పనులు అతను చెయ్యడు అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. తానూ బిగ్ బాస్ హౌస్ లో నాలుగు నెలల పాటు అతన్ని దగ్గరిగా చూశానని.. గెలిచాం అనే ఆనందం మనిషిని ఒక్కోసారి డామినేట్ చేసేస్తుందని..ఆ ఆనందంలోనే అతను ర్యాలీలో పాల్గొని ఉంటాడని శివాజీ తన అభిప్రాయం తెలిపాడు. బయట జరిగిన గొడవ గురించి కానీ, కార్ల అద్దాలు పగలగొట్టడం గురించి కానీ పల్లవి ప్రశాంత్ కు తెలిసి ఉండకపోవచ్చని శివాజీ అన్నారు. చట్టాన్ని గౌరవించి త్వరలోనే పల్లవి ప్రశాంత్ బయటకు వస్తాడని ఆశిస్తున్నానని అన్నారు. చట్టాన్ని అతిక్రమించారన్న నేరం పల్లవి ప్రశాంత్ పై పడిందని… కానీ అతను నిర్దోషి అని శివాజి పేర్కొన్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading