Home » ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..దిల్ రాజు ద్వారా ఆ సినిమా రీరిలీజ్..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..దిల్ రాజు ద్వారా ఆ సినిమా రీరిలీజ్..!

by AJAY
Ad

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ల ట్రెండు జోరుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలు అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సినిమాలు కూడా రీ రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా ఖుషి … జల్సా … పోకిరి … ఆరెంజ్ మూవీలు ఇప్పటికే రీ రిలీజ్ లో భాగంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను తెచ్చుకున్నాయి.

Dil Raju

దానితో మరి కొంత మంది హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా రీ రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. అందులో మనం మొదటిగా చూసుకున్నట్లు అయితే ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 వ తేదీన ఎన్టీఆర్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో ఒకటి అయినటువంటి సింహాద్రి మూవీని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు.

Advertisement

Advertisement

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే ఈ మూవీలోని “నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి” అనే సాంగ్ లిరికల్ వీడియోను కూడా ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా మే 7 వ తేదీన సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకు హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే మరో పక్క ఈ సినిమా యొక్క నైజాం , వైజాగ్ హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

simhadri

సింహాద్రి మూవీ రీ రిలీజ్ టైమ్ లో అన్నీ మంచి శకునములే … సామజవరగమన … బిచ్చగాడు 2 మూవీ లు విడుదల కానున్నాయి. ఈ మూవీలపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. దానితో సింహాద్రి మూవీకి వందల థియేటర్లు లభించే అవకాశం ఉంది. అందులోనూ దిల్ రాజు అండ ఈ మూవీకి ఉండడంతో రెండు ప్రాంతాల్లో కూడా క్వాలిటీ స్క్రీన్లు పడే అవకాశం ఉంది. ఇలా సింహాద్రి మూవీకి దిల్ రాజు అండ దొరకడంతో ఈ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Visitors Are Also Reading