టాలీవుడ్ లో రీసెంట్ సూపర్ హిట్ సినిమాలలో శ్యామ్ సింగరాయ్ కూడా ఒకటి. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించగా సినిమాలో హీరోగా నాని నటించారు. బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్నాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో హీరోయిన్ లుగా కృతి శెట్టి మరియు సాయిపల్లవి నటించగా లీడ్ రోల్ లో సాయిపల్లవి నటించింది. డిసెంబర్ 24న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అంతే కాకుండా పాన్ ఇండియా లెవల్ ఈ సినిమాను విడుదల చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి.
ఇక ఓటీటీలో ఈ సినిమా విడుదల కాగా అక్కడ కూడా భారీ వ్య్వూవ్స్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లను చిత్ర యూనిట్ కట్ చేయగా ఒక్కొక్కటిగా ఆ సీన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కట్ చేసిన రెండు సీన్లను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా శ్యామ్ సింగరాయ్ చనిపోయిన తరవాత అతడి అన్న రాహుల్ సాయిపల్లవిని రక్షించే సీన్ ను విడుదల చేశారు.
Advertisement
Advertisement
ఈ సీన్ లో సాయిపల్లవి తన భర్త కోసం వెళ్లగా తన వల్లే శ్యామ్ చనిపోయాడంటూ సాయి పల్లవి ముందు కూర్చుని రాహుల్ ఏడుస్తాడు. ఈ సీన్ ఎంతో ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టించే విధంగా అయితే ఈ సీన్ సినిమాలో ఉంటే మాత్రం సాయిపల్లవి ఇంకా బ్రతికే ఉందన్న విషయం ముందుగానే తెలిసిపోయేది. సీన్ డిలీట్ చేయడమే మంచిందైందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.