Home » బాలీవుడ్ , సౌత్ మధ్య వార్ పై శ్రుతి హాసన్ కామెంట్స్…!

బాలీవుడ్ , సౌత్ మధ్య వార్ పై శ్రుతి హాసన్ కామెంట్స్…!

by Azhar
Ad

ప్రస్తుతం మన ఇండియా సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ vs సౌత్ ఇండస్ట్రీ అనే వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒక్కపుడు మన సౌత్ సినిమాలో ఆయా రాష్ట్రంలో మాత్రమే విడుదల అయ్యేవి. కానీ అవి ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో వస్తున్నాయి. ముఖ్యంగా హిందీలో విడుదల అవుతున్న మన సినిమాలు అన్ని సూపర్ హిట్స్ గా నిలుస్తుండటం అక్కడి వారు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ వాగ్వాదానికి తెర లేపుతున్నారు.

Advertisement

అయితే ఇప్పుడు ఈ విషయం పై స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కొన్ని కామెంట్స్ చేసింది. శ్రుతి హాసన్ హాలీవుడ్ లో కూడా పరిచయమే అనే విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో శ్రుతి హాసన్ ముందుకు ఈ బాలీవుడ్ vs సౌత్ అనే ప్రశ్న వచ్చింది. ఇక దీనికి సమాధానం ఇస్తూ.. నేను ఈ రెండు ఇండస్ట్రీలలో పని చేస్తున్నాను. ఇప్పుడే కాదు నెం చిన్నపటి నుండి ఈ రెండు ఇండస్ట్రీలకు సంబంధించిన వ్యక్తులను చూస్తూ వస్తున్నాను. మా ఇంట్లో కూడా ఈ రెండు ఇండస్ట్రీలలో పని చేసే నటి నటులు వారు ఉన్నారు.

Advertisement

సినిమా అనేది ఓ కళ. కాబట్టి కళ అనే దానికి భాషతో సంబంధం ఉండదు. అందుకే నాకు ఎప్పుడు ఈ రెండు ఇండస్ట్రీల మధ్య తేడా అనేది కనిపించలేదు అని పేర్కొంది. ఇక ప్రస్తుతం శ్రుతి హాసన్ చేసిన ఈ కామెంట్స్ అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి. శ్రుతి హాసన్ చాలా జాగ్రత్తగా ఇంత సెన్స్టివ్ విషయం పై మాట్లాడింది అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటె.. ప్రస్తుతం శ్రుతి హాసన్ తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ప్రభాస్ తో చేస్తున్న సాలార్ అనే సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతుంది. ఇక మరో సినిమాలో బాలకృష్ణతో జత కడుతుంది శ్రుతి.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ ఆడుతావా.. లేదా..?

తన భర్త కెప్టెన్ తేలిగ్గా కాలేదు అంటున్న సంజనా..!

Visitors Are Also Reading