Home » శోభన్ బాబు జయలలితను నేనే కలిపా..కానీ వారు చేసిన పనికి..!!

శోభన్ బాబు జయలలితను నేనే కలిపా..కానీ వారు చేసిన పనికి..!!

by Sravanthi
Ad

అలనాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరో శోభన్ బాబు.. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరుపొందారు. అలాంటి శోభన్ బాబు తాను చనిపోయే వరకు హీరో గానే ఉన్నారు తప్ప మరో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇండస్ట్రీలో సోగ్గాడి గా పేరు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం మన మధ్య లేరు. కానీ ఆయనను ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే తాజాగా శోభన్ బాబు మరియు జయలలిత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Also read;నరేష్ కి రమ్య రఘుపతికి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

 అయితే దీనిపై స్పందించిన ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారయ్యా అంటే.. శోభన్ బాబు మరియు జయలలిత కలిసి తెలుగులో మొదటిసారిగా డాక్టర్ బాబు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని ఆయన అన్నారు. అయితే శోభన్ బాబును కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ కు వెళ్లి తన కారులోనే ఎక్కించుకొని ఊటీ షూటింగ్ లోకేషన్ కు తీసుకువచ్చానని గుర్తు చేశారు భరద్వాజ. ఆ షూటింగ్ స్పాట్ లోనే జయలలితను ఆయనకు పరిచయం చేశానని అన్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడిందని తెలియజేశారు..

Advertisement

అయితే ప్రతి మనిషికి ఏదో ఒక విక్నెస్ ఉంటుందని, ఆ వీక్నెస్ ను పట్టుకొని తప్పుగా అర్థం చేసుకోవడం మన తప్పే అని ఆయన అన్నారు. జయలలిత కు ఉన్న వీక్నెస్ వల్ల వీరిద్దరూ కలిసి ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అప్పట్లో వీరిద్దరి విషయం దేశం మొత్తం హాట్ టాపిక్ అయిందని తెలియజేశారు. వీరిద్దరూ కలిసి తిరుగుతున్న సమయంలోనే పిల్లలు కూడా పుట్టారని, వారిని సీక్రెట్ గా పెంచారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదంటూ చెప్పుకోచ్చారు భరద్వాజ. ఒకవేళ జయలలితకు కూతురే ఉన్నట్లయితే శశికళను ఆదరించాల్సిన పరిస్థితి ఆమెకు వచ్చేది కాదని, జయలలితకు కూతురు ఉన్నారు అనే విషయంలో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.

Also read;చంటి లాంటి హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading