Home » నరేష్ కి రమ్య రఘుపతికి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

నరేష్ కి రమ్య రఘుపతికి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య కాలంలో తరచూ సోషల్ మీడియాలో నరేష్ గురించి ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంది. ప్రధానంగా నరేష్ నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. కొద్ది రోజులుగా సహనటి అయినటువంటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. నరేష్ చేసిన పనికి అంతా ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. అసలు భవిష్యత్ లో పెళ్లి జోలికి వెళ్లను అని చెప్పిన నరేష్.. పవిత్ర లోకేష్ ని నాలుగో పెళ్లి చేసుకోవడానికి ఎలా రెడీ అయ్యాడు..? మరోవైపు పవిత్రకు కూడా ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. వీరి పెళ్లిలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. వీరు పెళ్లి చేసుకుంటే నరేష్ మూడో భార్య సంగతి ఏంటి..? నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ముఖ్యంగా “నరేష్ 1963లో జన్మించారని, నేను 1982లో జన్మించానని వెల్లడించారు. మా ఇద్దరి మధ్య దాదాపు 20 ఏళ్ల గ్యాప్ ఉంది. తన వయస్సు కంటే నేను 12 సంవత్సరాల వయస్సు తక్కువ అని అందరికీ చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే నిజం తెలిసిందని.. అయితే నన్ను మిస్ అయిపోతానని చెప్పి.. పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది. మరోవైపు నరేష్ జాతకాన్ని వేణుస్వామికి చూపించగా.. ఆయనకి ఈ మ్యారేజ్ సెట్ కాదని చెప్పారు. 498 ఏ కేసు నమోదు చేయాలని మా లాయన్ సూచించినట్టు తెలిపింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తాను భరణం తీసుకున్నట్టు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించింది. 

Also Read :  నా భార్య లేకుంటే నా బ్రతుకేంటో..అంటూ ఎమోషనల్ అయిన శివ బాలాజీ..!!

Manam News

ఇక మా పెళ్లి జరిగిన ఏడాది తరువాత నరేష్ కి, నాకు బాబు పుట్టాడు. నరేష్ కి రఘువీరారెడ్డి నుంచి ఎలా సపోర్ట్ రాలేదని రమ్య కామెంట్స్ చేసింది. పెళ్లికి ముందే నరేష్ లేచి పోదామని చెప్పారు. లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందామని నరేష్ కోరగా.. నేను ఒప్పుకోలేదు అని వెల్లడించడం గమనార్హం. బెంగళూరులో మా పెళ్లి జరిగిందని రమ్య రఘుపతి చెప్పడం విశేషం. 20 ఏళ్ల జీవితం ఇస్తానని నాకు మాట ఇచ్చి నరేష్ నన్ను పెళ్లి చేసుకున్నాడని.. ఆయన మాటలు నమ్మి నేను అంగీకరించాను. విజయనిర్మల గారు నాతో ఎంత కష్టం వచ్చినప్పటికీ ముఖంపై చూపించకూడదని చెప్పేవారు. విజయనిర్మల గారికి ఉన్న బాధను కూడా ఎవ్వరికీ చెప్పుకునే వారు కాదు” అని రమ్య రఘుపతి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం రమ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read :   ఆస్కార్ రేస్ లో ఎన్టీఆర్.. హాలీవుడ్ స్టార్స్ తో పోటీలో కొమురం భీముడు

Visitors Are Also Reading