Home » పంజాబ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లనందుకు ధావన్ కు దెబ్బలు.. కిందపడేసి మరి..?

పంజాబ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లనందుకు ధావన్ కు దెబ్బలు.. కిందపడేసి మరి..?

by Azhar
ఐపీఎల్ 2022 పూర్తి కావడానికి చేరువలో ఉంది. ఈరోజు లక్నో సూపర్ జెంట్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కాకుండా ఈ నెల 27న జరిగే క్వాలిఫైర్ 2 అలాగే 29న జరిగే ఫైనల్స్.. రెండు మ్యాచ్ లు మాత్రమే బాకీ ఉన్నాయి. అయితే గత ఏడాది వరకు 8 జట్లతో జరిగిన ఈ లీగ్ లో ఈ ఏడాది రెండు కొత్త జట్లు రావడంతో… ప్లే ఆఫ్స్ కు కాంపిటీషన్ బాగా పెరిగింది. అయితే ఈ 10 జట్లలో గుజరాత్, రాజస్థాన్, లక్నో, బెంగళూర్ ఈ నాలుగు జట్లే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగా… మిగిలిన 6 జట్లు ఇంటి దారి పట్టాయి. అందులో పంజా కింగ్స్ కూడా ఒక్కటి.
అయితే ఈ జట్ల ఆటగాళ్లు ఐపీఎల్ బయో బాబుల్ నుండి బయటకు వచ్చి ఇంటికి చేరుకున్నారు. అందులో అందరికి ఎలా స్వాగతం దొరికిందో తెలియదు.. కానీ పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు మాత్రం మాములుగా స్వాగతం దొరకలేదు. ధావన్ ఇంటి లోపలి వెళ్లగానే తన తండ్రి గబ్బర్ కు ఉతికేసాడు. మొదట చెంప చెళ్లుమనిపించిన తర్వాత కింద పడేసి కొట్టాడు. కాలుతో తన్నాడు కూడా. పక్కన ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించిన ఆగలేదు.
తన తండ్రి కొట్టిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినా గబ్బర్.. మేము ప్లే ఆఫ్స్ కు వెళ్లనందుకు.. మా నాన్న నాతో ఆడుకున్నాడు అని పోస్ట్ చేసాడు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫన్నీ వీడియోస్ పెట్టె గబ్బర్.. ఇది కూడా ఫన్నీగా తన నాన్నతో ఇలా విడి క్రియేట్ చేసి పెట్టాడు. అయితే గత ఏడాది వరకు ఢిల్లీ జట్టుకు ఆడిన గబ్బర్ ను ఈ ఏడాది మెగవేలంలో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఐతే ధావన్ కూడా అనుకున్న విధంగా బాగానే రాణించాడు. కానీ జట్టు చేసిన కొన్ని తప్పుల వల్ల కొన్ని కీలక మ్యాచ్ లలో ఓడిపోయి ప్లే ఆఫ్స్ కు వెళ్ళలేదు.
Visitors Are Also Reading