Home » షర్మిల ప్రభావం ఏపీ రాజకీయాల్లో జీరో: మినిష్టర్ అమర్ నాథ్

షర్మిల ప్రభావం ఏపీ రాజకీయాల్లో జీరో: మినిష్టర్ అమర్ నాథ్

by Sravya
Ad

వైయస్ షర్మిల కి పిసిసి పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పిసిసి పదవిపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ కి సీట్లే కాదు ఓటేసే దిక్కే లేదని విమర్శించారు. షర్మిల ప్రభావం జీరో అని ఆరోపించారు. ఏపీ ప్రజల ఆకాంక్షలని గొడ్డలితో అడ్డంగా నరికేసింది కాంగ్రెస్ అని అన్నారు మినిస్టర్ అమర్నాథ్. నిన్నటిదాకా ఒకరు ఇవాళ ఇంకొకరు అని పేర్కొన్నారు. అధ్యక్షులు మారినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని కామెంట్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Ys sharmila Into Congress party

Advertisement

Advertisement

చంద్రబాబు గురించి కూడా మాట్లాడుతూ స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకి ఊరట కలిగిందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు బెయిల్ మీద ఉన్న దొంగ అని విమర్శించారు. చంద్రబాబు కోర్టు బోనులో నిలబడి సమాధానం చెప్పాల్సింది అని అన్నారు ద్విసభ్య ధర్మాసనం చాలా క్లియర్ గా చెప్పిందని ఇన్వెస్టిగేషన్ రిమాండ్ ప్రొసీజర్ పక్కాగానే జరిగిందని బెంచ్ అభిప్రాయ పడినట్లు చెప్పారు. ఏ విధంగానూ ఇది చంద్రబాబుకి అనుకూలం కాదని అమాయక చక్రవర్తిని ఎక్కడ చెప్పలేదని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading