Home » ప్రపంచ కప్ కు ఆ కీపర్ నే పంపండి…

ప్రపంచ కప్ కు ఆ కీపర్ నే పంపండి…

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో సీనియర్ల కంటే జూనియర్ ఆటగాళ్లు బాగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ లో జూనియర్లే పై చేయి సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆసీస్ లో జరగబోయే ప్రపంచ కప్ కు ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయం పై చాల సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రపంచ కప్ కు వికెట్ కీపర్ గా ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంలో భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

Advertisement

తాజాగా సెహ్వాగ్ మాట్లాడుతూ… ప్రపంచ కప్ టోర్నీ సెలక్షన్ నా చేతిలో ఉంటె.. స్టాండ్ బై వికెట్ కీపర్ గా నేను జితేశ్ శర్మను ఎంపిక చేస్తాను అని అన్నాడు. ఈ ఐపీఎల్ లో పంత్, సాహా, సంజు శాంసన్ వంటి భారత వికెట్ కీపర్లు అందరూ బాగానే రాణిస్తున్నారు. కానీ వీరందరి కంటే నన్ను పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ బాగా ఆకట్టుకున్నాడు అని తెలిపాడు. అతను ఎటువంటి భయం లేకుండా.. ఎటువైపు షాట్ కొట్టాలి అనేది పక్కాగా నిర్ణయించుకొని ఆడుతున్నాడు.

Advertisement

నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 17 బంతుల్లో 30 పరుగులు చేసిన జితేశ్.. చాహల్ బౌలింగ్ లో కొట్టిన ఓ సిక్స్ నాకు దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ను గుర్తు చేసింది. లక్ష్మణ్ ఏ విధంగా అయితే స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ బౌలింగ్ లో సిక్స్ కొడతాడో.. జితేశ్ కూడా అలానే బ్యాటింగ్ చేసాడు అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ధోని మాటలకు అర్ధం అదే..!

గుజరాత్ టైటాన్స్ తరపున పోలార్డ్…?

Visitors Are Also Reading