Home » బయోపిక్ కు డబ్బులు ఇస్తామన్న “మేజర్” నిర్మాతలు….సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి ఏమన్నారో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..!

బయోపిక్ కు డబ్బులు ఇస్తామన్న “మేజర్” నిర్మాతలు….సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి ఏమన్నారో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..!

by AJAY
Ad

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటించారు. ముంబై ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రియల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా… టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నిర్మించారు.

Advertisement

ఎన్నో అంచనాల మధ్య జూన్ 3న విడుదలైన ఈ సినిమాకు ప్రశంసలు అందుతున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే సాధారణంగా బయోపిక్ లు తీయాలంటే వాళ్ల కుటుంబ సభ్యులకు రాయల్టీ కింద డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం గురించి నిర్మాతలు అనురాగ్, శరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

సాధారణంగా బయోపిక్ లు తీస్తే రాయల్టీ ఇవ్వాల్సివస్తుందని చెప్పారు. తాము కూడా సందీప్ పేరెంట్స్ కు రాయల్టీ ఇస్తామని చెప్పామని… అది వినగానే సందీప్ తండ్రి తమ పై ఫైర్ అయ్యారు అని తెలిపారు. గెటవుట్ ఫ్రమ్ మై హౌస్ అంటూ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి సీరియస్ అయ్యాడని చెప్పారు.

తన కొడుకు జీవితాన్ని తాకట్టు పెట్టుకునే దీనస్థితిలో లేమని అన్నారని… సందీప్ చనిపోయిన తర్వాత వచ్చిన ఎల్ఐసి డబ్బులు కూడా వాళ్ళు తీసుకోలేదని చెప్పారు. ఆ డబ్బులను తమ సన్నిహితులకు ఇచ్చారని అన్నారు. దాంతో తాము ఒక నిర్ణయం తీసుకున్నామని… ఆర్మీ లో చేరాలనుకునే యువతకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేయాలని నిర్ణయించుకునట్టు వెల్లడించారు.

Also read : “విక్రమ్” సినిమాలో నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా…సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందంటే…!

Visitors Are Also Reading