Home » Samantha : కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన సమంత

Samantha : కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన సమంత

by Bunty
Ad

టాలీవుడ్ అందాల తార సమంత తాజాగా శాకుంతలం సినిమాలో నటించింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. భారీ విజువల్స్ గ్రాఫిక్స్ తో ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే శాకుంతలం సినిమా టీజర్ మరియు ట్రైలర్లను విడుదల చేయగా, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో సమంత ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

READ ALSO :ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ అంటే..? 

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా మరో బిజినెస్ లోకి అడుగు పెట్టింది. సమంత భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫుడ్ బ్రాండ్ నౌరిష్ యు లో సమంత పెట్టుబడులు పెట్టింది. జరోధాకు చంద్ర నిఖిల్ కామత్, డార్విన్ బాక్స్ రోహిత్ చెన్నమనేనిలు సైతం నౌరిష్ యు లో పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు. ఈ సంస్థ మిల్లెట్ ఫుడ్ ని, మిల్లెట్స్ తో తయారు చేసిన ఫుడ్ ని ఉత్పత్తి చేస్తుంది.

Advertisement

READ ALSO :  TS Constable : ఏప్రిల్‌ 2న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి

Samantha: కొత్త బిజినెస్‏లోకి అడుగుపెట్టిన సమంత.. ఇంతకీ సామ్ ఎంటరైన బ్రాండ్ ఏంటంటే.. | Samantha has entered into a new business.. So far Sam has entered into which brand.. telugu cinema news ...

మిల్లెట్ మిల్క్, మిల్లెట్ చిక్కీస్, మిల్లెట్ ఫ్లెక్స్.. ఇలా మిల్లెట్స్ తో తయారు చేసిన పలు రకాల పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. తాజాగా ఈ సంస్థలో సమంత ఇన్వెస్ట్ చేసింది. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యంతో సమంత వారి బ్రాండ్ మిల్లెట్ మిల్క్ డబ్బాలు పట్టుకొని ఫోజులు ఇచ్చిన ఫోటోని ఇన్వెస్ట్మెంట్ గురు ఇండియా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ న్యూస్ చెప్పగా సమంత దాన్ని షేర్ చేసి ఎస్ అంటూ ట్వీట్ చేసింది.

READ ALSO : విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు..”పుష్ప” ఐటెం సాంగ్ వద్దన్నారంటూ !

Visitors Are Also Reading