Home » ఒక్క అడుగు కూడా వేయ‌లేనేమో అనిపిస్తుంది…ఇంట‌ర్వ్యూలో క‌న్నీళ్లు పెట్టుకున్న సమంత‌..!

ఒక్క అడుగు కూడా వేయ‌లేనేమో అనిపిస్తుంది…ఇంట‌ర్వ్యూలో క‌న్నీళ్లు పెట్టుకున్న సమంత‌..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవ‌ల మయోసైటిస్ అనే వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం స‌మంత కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే స‌మంత న‌టించిన య‌శోద సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. దాంతో స‌మంత సినిమా ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టింది. ఈ నేప‌థ్యంలో స‌మంత తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాక్య‌లు చేసింది.

Advertisement

ప్ర‌పంచంలో చాలా మంది మ‌యోసైటిస్ అనే వ్యాధిని స‌మర్ద‌వంతంగా జ‌యించార‌ని అన్నారు. తాను కూడా దీనిని స‌మర్ద‌వంతంగా ఎదురుకుంటాన‌ని స‌మంత పేర్కొంది. ఈ క్ర‌మంలో స‌మంత చాలా ఎమోష‌న‌ల్ అయ్యి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌ట్టు కొంతమంది వార్త‌లు రాశార‌ని కానీ ప్ర‌స్తుతం తాను అలాంటి స్థితిలో లేన‌ని తాను చ‌నిపోలేద‌ని స‌మంత ఎమోష‌న‌ల్ అయ్యింది.

Advertisement

యాంక‌ర్ ఫ్యాచ‌ర్ ప్రాజెక్టుల గురించి అడ‌గ్గా మ‌నచేతుల్లో ఏది ఉండ‌ద‌ని అంతా మన జీవిత‌మే డిసైడ్ చేస్తుంద‌ని స‌మంత క‌న్నీళ్లు పెట్టుకుంది. ప్ర‌స్తుతం తాను క‌ఠిన ప‌రిస్థితుల్లో ఉన్నానని అంద‌రి జీవితాల‌లో మంచి రోజులు చెడు రోజులు ఉంటాయ‌ని చెప్పింది. అంతే కాకుండా ఒక్కోసారి తాను ఒక్కో అడుగు కూడా వేయ‌లేక‌పోతున్నాన‌ని అయితే తాను పోరాటం చేస్తున్నాన‌ని గెలుస్తాన‌ని స‌మంత ధీమా వ్య‌క్తం చేశారు.

Visitors Are Also Reading