Home » ఈ సమాజం అబద్ధాలనే నమ్ముతుంది….వైరల్ అవుతున్న సమంత పోస్ట్….!

ఈ సమాజం అబద్ధాలనే నమ్ముతుంది….వైరల్ అవుతున్న సమంత పోస్ట్….!

by AJAY
Ad

టాలీవుడ్ బ్యూటీ సమంత నాగ చైతన్య తో విడాకుల తర్వాత కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. కానీ తక్కువ సమయంలోనే మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఇక సమంత తరచూ తన పెట్స్ కు సంబంధించిన ఫన్నీ వీడియోలు మరియు తన ఫిట్నెస్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

Advertisement

అదేవిధంగా సినిమా అప్డేట్స్ మరియు ప్రమోషన్ కు సంబంధించిన వివరాలను సైతం సమంత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. దాంతో సమంతకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే విడాకుల తర్వాత సమంత తన సోషల్ మీడియా ద్వారా చేస్తున్న కొన్ని పోస్టులు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి.

Advertisement

అయితే ఆ పోస్టులు నాగ చైతన్యను ఉద్దేశించే అని కొందరు భావిస్తుంటే… మరికొందరు సమంత గతంలో కూడా ఇలాంటి పోస్టులను షేర్ చేసేదని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం సమంత గతంలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ సమాజంపై అసహనం వ్యక్తం చేసినట్టు కనిపిస్తోంది.

Samantha

Samantha

సమంత ఈ పోస్టులో…. నిజాలు అనేవి అరుదుగా బయటకు వస్తాయి. కానీ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి. అంతే కాకుండా ఈ సమాజం కూడా ఎక్కువగా అబద్ధాలని నమ్ముతుంది. అంటూ పేర్కొంది. అయితే ఈ పోస్ట్ ను సమంత తమ విడాకులకు సంబంధించి చేసింది అని కొంతమంది నెటిజన్లు భావిస్తుండగా మరికొంతమంది మాత్రం సమంత తన హాలీవుడ్ సినిమాల ఎంట్రీ పై వస్తున్న రూమర్స్ గురించి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Visitors Are Also Reading