తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల… రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మొన్న ఢిల్లీకి వెళ్లిన వైయస్ షర్మిల… కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు అయిన రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున ఖర్గే సమక్షంలో… కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా… తెలంగాణ వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేశారు వైయస్ షర్మిల.
అయితే వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల వైసిపి పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు వరసగా వైసీపీ పార్టీ అగ్ర నేతలు అందరూ షర్మిలపై విరుచుకుపడుతున్నారు. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరడం పట్ల…సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మరణం పై కాంగ్రెస్కు సంబంధించి ఆరోజు నుంచే అనుమానాలు ఉన్నాయని బాంబు పేల్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Advertisement
టీడీపీ, కాంగ్రెస్ కలిసే జగన్పై తప్పుడు కేసులు పెట్టాయని ఆగ్రహించారు. కాంగ్రెస్తో ఎప్పుడూ చంద్రబాబు కంటాక్ట్లో ఉంటున్నాడు. షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన సంచలన ఆరోపణలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు తనకేం కావాలో అందరితో కలిసి చేయిస్తాడని ఆగ్రహించారు. సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబు మైనస్ మార్కులు వస్తాయి. అందుకే ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.