Home » యాక్సిడెంట్ త‌ర‌వాత సాయిధ‌ర‌మ్ తేజ్ ఎమోష‌నల్ కామెంట్స్…!

యాక్సిడెంట్ త‌ర‌వాత సాయిధ‌ర‌మ్ తేజ్ ఎమోష‌నల్ కామెంట్స్…!

by AJAY
Ad

మెగామేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కొద్దిరోజుల క్రితం హైద‌రాబాద్ లో రోడ్డుప్ర‌మాదంలో గాయ‌పడిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా సాయిధ‌ర‌మ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. కోలుకున్న అనంత‌రం సాయి ధ‌ర‌మ్ తేజ్ మొద‌టిసారి మీడియా ముందుకు వ‌చ్చాడు. ఈ సంధ‌ర్బంగా సాయిధ‌ర‌మ్ తేజ్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. త‌ను రోడ్డు ప్ర‌మాదం భారిన‌ప‌డ్డ స‌మ‌యంలో తోడుగా ఉన్న‌వాళ్లకు సాయం చేసిన‌వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

Advertisement

Advertisement

ముందుగా మాన‌వ‌త్వం ఇంకా బ్ర‌తికే ఉంద‌ని త‌న‌ను కాపాడిన స‌య్య‌ద్ అబ్దుల్ ఫ‌రూక్ లాంటి వ్య‌క్తుల వ‌ల్ల తెలుస్తుంద‌ని అన్నారు. ఇలాంటి స‌మ‌యంలో త‌న ఫ్యామిలీ ఎంతో హెల్ప్ చేసింద‌ని సాయిధ‌ర‌మ్ తేజ్ తెలిపారు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్, నాగ‌బాబు, అల్లు అర‌వింద్, రామ్ చ‌ర‌ణ్ , అల్లు అర్జున్, ఉపాస‌న‌ల‌కు సాయిధ‌ర‌మ్ తేజ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంతే కాకుండా త‌న‌ను ఎంతో కేర్ తో చూసుకున్న అపోలో డాక్ట‌ర్ ల‌కు మ‌రియు మెడిక్యూర్ వైద్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. తాను హెల్మెట్ పెట్టుకోవ‌డం వ‌ల్లే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాన‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ హెల్మెట్ ధ‌రించాల‌ని సాయి ధ‌ర‌మ్ తేజ్ అన్నారు.

Visitors Are Also Reading