Home » ఆ లేతగులాబీ లాంటి హీరోయిన్ తో లవ్ లో పడ్డ హీరో సాయి ధరంతేజ్..!!

ఆ లేతగులాబీ లాంటి హీరోయిన్ తో లవ్ లో పడ్డ హీరో సాయి ధరంతేజ్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సాయి ధరంతేజ్ అంటే తెలియని వారు ఉండరు. తీసింది కొద్ది సినిమాలే అయినా ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. పిల్ల నువ్వు లేని జీవితం అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయి ధరంతేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డం కోసం కష్టపడుతున్నారు. అయితే ఈ సినిమాలో సాయి ధరంతేజ్ కి జంటగా రెజీనా నటించిన విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా రెజీనా హీరోయిన్ గా చేసింది.

also read:ప్రియురాలి రూపంలో నరరూప రాక్షసి.. ప్రియుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చేసిన పని..ఏంటంటే ?

Advertisement

also read:తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

Advertisement

దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని, సాయి ధరమ్ తేజ్ భార్య రెజీనా అంటూ అనేక వార్తలు వినిపించాయి. కానీ ఈ మధ్యకాలంలో సాయి ధరంతేజ్ రెజినాను వదిలేసి మరో యంగ్ బ్యూటీ మాయలో పడ్డారని తెలుస్తోంది. మరి ఆయన లవ్ లో పడ్డ హీరోయిన్ ఎవరో చూద్దామా.. సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న తాజా సినిమా విరూపాక్ష. ఈ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ టైంలోనే సాయి ధరమ్ తేజ సంయుక్త ప్రేమలో పడ్డారని, ఓ రోజు సాయంత్రం ఏకంగా సంయుక్త మీనన్ ని తన ఇంటికి కూడా తీసుకెళ్లి ఫ్యామిలీకి పరిచయం చేశాడని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సాయి ధరంతేజ్ కాబోయే భార్య సంయుక్త అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి వ్యవహారం గురించి ట్రెండింగ్ గా మారింది.

also read:త్రిష‌కు ల‌వ‌ర్ గా తండ్రిగా మామ‌గా న‌టించిన ఒకే ఒక్క న‌టుడు ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading