పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీ సార్టర్లుగా తెరకెక్కిన బ్రో చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇటు పవన్ అభిమానులు, సాయిధరమ్ తేజ్ అభిమానులు, అటు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు ఫుల్ ఖుషీలో ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా సక్సెస్ లో భాగంగా టూర్లు తిరుగుతూ, అభిమానులను కలుస్తున్నారు. ఈ సినిమా విజయ యాత్రలో చాలా మంది అభిమానులు పాల్గొంటున్నారు.
Advertisement
ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ తన అభిమానులకు బహిరంగంగా లేఖ రాసారు. బ్రో సినిమా విజయ యాత్రలో భాగంగా నన్ను కలవడానికి వచ్చే వారు, సెల్ఫీలు తీసుకునే వారు, ఆటో గ్రాఫ్ లు అడిగేవారు.. ఇలా మీరందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాపై మీరు చూపించే అభిమానానికి చాలా చాలా థాంక్స్ అని తెలిపారు. సినిమా గురించి మీ నోట వినడం, మిమ్మల్ని కలవడం, మీ ప్రేమని పొందడం చాలా బాగుంది. మీరందరు ఆప్యాయంగా దగ్గరకు వస్తుంటే.. సాధ్యమైనంత వరకు మీకు అందుబాటులో ఉండడానికే ప్రయత్నిస్తున్నాను.
Advertisement
కానీ, నాకోసం వచ్చే మీరు మీ సేఫ్టీ గురించి పట్టించుకోకపోవడం బాధాకరం. చాలా మంది బైక్ పై ఫాలో చేస్తున్నారు. వీడియోలు తీస్తున్నారు. కానీ, మీరంతా హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం వదిలేసారు. మీ అభిమానం ఇలా ఎప్పటికీ కావాలని అనుకుంటున్నాను. మీరు నా అభిమానుల లా కన్నా.. నా బ్రోస్ లా భావిస్తున్నా. మీ భద్రత కూడా నా బాధ్యతే. మీరు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ లేఖను ఆయన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసారు. ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
Grateful for your love & kindness. Thank you! 🙏🏼#BroTheAvatar #BroVijayaYatra pic.twitter.com/ntpjS3Pg27
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 4, 2023
మరిన్ని..
వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !