సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చిన వారిని వాడుకోవాలని చూసేవాళ్లు చాలా మంది ఉంటారు. మగవాళ్లను అయితే డబ్బుకోసం ఆడవాళ్లను అయితే శారీరకంగా ఇలా మోసం చేసేవాళ్లు ఎంతోమంది ఉంటారు. కాబట్టి తెలివిగా వ్యవహరిస్తేనే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. లేదంటో ఎవరి చేతిలోనో మోసపోయి చివరికి జీవితాన్ని నాశనం చేసుకోవడం కాయం. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు సైతం అలా మోసపోయి చివరికి బలవన్మరణానికి పాల్పడ్డారు.
Advertisement
స్టార్ హీరోయిన్ చెల్లెలు అయినప్పటికీ సిమ్రాన్ సోదరి రాధా మోనాల్ ఓ వ్యక్తి చేతిలో మోసపోయింది. మోనాల్ కూడా హీరోయిన్ గా అనేక చిత్రాలలో నటించింది. మోనాల్ ఎన్నో ఆశలతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. మోనాల్ హిందీతో పాటూ తమిళ చిత్రాల్లో నటించింది. ఇష్టం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. సిమ్రన్ చెల్లెలిగా మంచి గుర్తింపు ఉండేది.
Advertisement
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఓ కొరియోగ్రాఫర్ ను ప్రేమించింది. మొదట కొరియోగ్రాఫర్ మోనాల్ ను ప్రాణంగా ప్రేమిస్తున్నా అంటూ వెంటపడ్డాడు. ఆ తరవాత మోనాల్ అతడిని నమ్మి ప్రేమించింది. కానీ ప్రాణంగా ప్రేమిస్తున్నా అని చెప్పిన కొరియోగ్రాఫర్ వాడుకుని దూరం అయ్యాడు. దాంతో మోనాల్ ఆ మోసాన్ని తట్టుకోలేకపోయిందట. ఆ మోసాన్ని భరించలేకే మోనాల్ చైన్నై లోని తన ఫ్లాట్ లో ఉరివేసుకుంది.
మోనాల్ చనిపోయిన తరవాత అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంది అనే వార్తలు వినిపించాయి. ఆ తరవాత మోనాల్ కొరియోగ్రాఫర్ చేతిలో మోసపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుంది అనే వార్తలు కోలీవుడ్ ను షేక్ చేశాయి. అంతే కాకుండా అప్పటికే మోనాల్ గర్భవతి అని కూడా వార్తలు వచ్చాయి. మోనాల్ ను మోసం చేసిన కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ అని టాక్ వినిపించింది. కానీ సుజిత్ మాత్రం ఎప్పుడూ ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు.