Home » ఏపీ టికెటింగ్ విష‌యంపై ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో దుమారం..ఎన్టీఆర్ స్నేహితులు ప్ర‌భుత్వంలో ఉన్నారంటూ కామెంట్స్..!

ఏపీ టికెటింగ్ విష‌యంపై ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో దుమారం..ఎన్టీఆర్ స్నేహితులు ప్ర‌భుత్వంలో ఉన్నారంటూ కామెంట్స్..!

by AJAY
Ad

ఏపీలో సినిమా టికెటింగ్ విధానంపై వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర‌యూనిట్ ఏర్పాటు చేసిన‌ మీడియా సమావేశంలోనూ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఆర్ఆర్ టీం నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ నిర్మాత దానయ్య కు ఆసక్తికర ప్రశ్న వేశారు. ఏపీలో సినిమా టికెట్ ధరల‌ విషయంలో ఏం చేయబోతున్నారని… ఎన్టీఆర్ సన్నిహితులు ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నారు వాళ్ళ హెల్ప్ ఏమైనా తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. దానికి నిర్మాత దానయ్య ఎన్టీఆర్ ముఖం చూసి సమాధానమిస్తూ… సినిమా టికెట్ ధరల‌ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని అన్నారు.

rrr pressmeet

rrr pressmeet

ఈ అంశం కొలిక్కి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద సినిమాలకు వర్కవుట్ కాదని వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఓ సారి ఆన‌య్య ట్వీట్ చేస్తూ ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు మరోసారి రిపోర్టర్ ప్రశ్నించడంతో దానయ్య స్పందించారు.

Advertisement

Advertisement

also read : షూటింగ్ లో చరణ్ ఎన్టీఆర్ మ‌ధ్య గొడ‌వ‌లు… 25 రోజులు వృధా అయ్యాయి..రాజ‌మౌళి షాకింగ్ కామెంట్స్..!

ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం లో ఉన్న ఇద్ద‌రు ఎన్టీఆర్ కు స్నేహితులు అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్న దుమారం రేపుతోంది. ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి ప్రశ్న వేశారని అభిమానులు మీడియా ప్ర‌తినిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌లు నెటిజ‌న్లు ఆ స్పేహితులు ఇద్ద‌రు మంత్ర‌లు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్ర‌భుత్వంలోని ఇద్ద‌రు ఎన్టీఆర్ కు స్నేహితులు అంటూ రిపోర్ట‌ర్ వ్యాఖ్యానించిన‌ప్పుడు ఎన్టీఆర్ కూడా ఇబ్బంది ప‌డిన‌ట్టు క‌నిపించింది.

Visitors Are Also Reading