Home » Rishabh Pant : యాక్సిడెంట్ తర్వాత పంత్ ఫస్ట్ ఫోటో రిలీజ్… వైరల్

Rishabh Pant : యాక్సిడెంట్ తర్వాత పంత్ ఫస్ట్ ఫోటో రిలీజ్… వైరల్

by Bunty
Ad

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్ లో ఢిల్లీ నుంచి వస్తుండగా రూర్కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా యాక్సిడెంట్ లో పంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడు ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. దాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న పంత్ తన ఆరోగ్యం గురించి తాజాగా సమాచారం ఇచ్చాడు.

Advertisement

తాను ఆటలో యాక్టివ్ గా లేనప్పటికీ ఆసుపత్రి నుంచి తరచూ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే వస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న టీమ్ ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇటీవల ఆసుపత్రి ఆవరణలోని బాల్కనీ నుంచి తీసి ఒక ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ, “స్వచ్ఛమైన గాలిని పిలుస్తుంటే హాయిగా ఉందంటూ” క్యాప్షన్ జతచేశాడు. దీనికి వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.

Advertisement

తాజాగా పంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్సిడెంట్ తర్వాత తొలిసారి నడుస్తున్న ఫోటోలను బయటికి వదిలాడు. ఫోటోలో పంత్ వాకింగ్ స్టిక్ సాయంతో ఒక్కో అడుగు వేస్తున్నట్లుగా కనిపించింది. అయితే కుడి కాలికి బ్యాండేజ్ కనిపించడం, కాలు కూడా కొంచెం ఉబ్బినట్లుగా ఉంది. దీనిని బట్టి కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోను షేర్ చేసుకున్న పంత్, ఒక్క అడుగు ముందుకు, ఒక్క అడుగు బలంగా, ఒక్క అడుగు బెటర్ గా అంటూ క్యాప్షన్ జత చేయడం ఆసక్తిని కలిగించింది.

read also : రాజకీయాలకు గుడ్ బై..సినిమాల్లోకి ఏపీ మంత్రి విడదల రజిని?

Visitors Are Also Reading