ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన రోజా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన రోజా ఆ తర్వాత వైసిపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి మెజారిటీతో గెలిచారు. ఇక ప్రస్తుతం రోజా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని అందుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా రోజా ప్రజా సేవ చేస్తున్నారు. అదే విధంగా చాలా కాలం పాటు జబర్దస్త్ లో సందడి చేసినప్పటికీ ఆ తర్వాత దూరమయ్యారు.
Advertisement
మంత్రి పదవి వచ్చిన తర్వాత తన పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించారు. ఇదిలా ఉంటే అల్లరి నరేష్ రోజాల మధ్య ఓ అనుబంధం ఉంది. అల్లరి నరేష్ మొదట కామెడీ సినిమాలు చేసినప్పటికీ ప్రస్తుతం ఉగ్రం, నాంది లాంటి డిఫరెంట్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా నరేష్ టాలీవుడ్ లో అడుగు పెట్టాడు.
Advertisement
నటుడిగా కమెడియన్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అల్లరి నరేష్ రోజాతో కలిసి శంభో శివ శంభో సినిమాలో నటించాడు. ఇది ఇలా ఉంటే రోజా జబర్దస్త్ షో లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఈవీవీ దర్శకత్వంలో సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో నటించానని చెప్పింది. ఆ సినిమా సమయంలో అల్లరి నరేష్ స్కూల్ కి వెళ్లే వాడు అని చెప్పింది.
అప్పుడు అతడిని ఎత్తుకుని ఆడేదాన్ని అని…. ఇప్పుడు నన్ను ఎత్తుకుని ఆడుతున్నాడు అంటూ రోజా కామెంట్లు చేసింది. అల్లరి నరేష్ నాంది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు విజయ్ కనకమేడలతో కలిసి జబర్దస్త్ కు వెళ్ళాడు. ఆ సమయంలో రోజాతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆమెను ఎత్తుకున్నాడు. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలో నటించగా ఆ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మరి ఆ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.