Home » ప‌వ‌న్ స‌త్యాగ్ర‌హి సినిమా ఎందుకు ఆగిపోయింది..ఇంత‌కాలానికి తెలిసిన అస‌లు నిజం ఇదే…!

ప‌వ‌న్ స‌త్యాగ్ర‌హి సినిమా ఎందుకు ఆగిపోయింది..ఇంత‌కాలానికి తెలిసిన అస‌లు నిజం ఇదే…!

by AJAY
Ad

కొన్ని సినిమాలను మొద‌ట భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రారంభించినప్ప‌టికీ అనేక కార‌ణాల వ‌ల్ల అవి మ‌ధ్య‌లోనే ఆగిపోతాయి. అలా ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ కెరీర్ లో కూడా ఓ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ ప‌ట్టాలెక్కి ఆ త‌ర‌వాత ఆగిపోయింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన ఖుషి సినిమాను నిర్మించిన శ్రీసూర్య మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మాత ఏఎం ర‌త్నం ఆ సినిమాను ప్రారంభించారు.

Advertisement

ఆ సినిమా టైటిల్ ను స‌త్యాగ్ర‌హి గా అనౌన్స్ కూడా చేశారు. అంతే కాకుండా ఆ సినిమాకు అన్న‌పూర్ణ స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వహించిన ఓపెనింగ్ షాట్ కూడా తీశారు. దాస‌రినారాయ‌ణ‌రావు క్లాప్ కొట్ట‌గా హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అంతే కాకుండా ద‌ర్శ‌కుడు వివి వినాయ‌క్ ఈ సినిమా ఫ‌స్ట్ షాట్ తీశారు. అయితే ఈ సినిమాను మ‌ధ్య‌లోనే ఆపేశారు.

Advertisement

సినిమా ఆగిపోవ‌డానికి క్రియేటివ్ డిఫ‌రెన్స్ లు రావ‌డం కార‌ణం అని…స్క్రిప్ట్ స‌రిగా రాలేద‌ని…బ‌డ్జెట్ ఎక్కువ అవుతుంద‌ని ఇలా రక‌ర‌కాల కార‌ణాలు అప్ప‌ట్లో వినిపించాయి. అయితే ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో అసలు కార‌ణం నిర్మాత ఏఎం ర‌త్నం ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. జాని సినిమా ఫ్లాప్ అయిన త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా నిరాశ చెందార‌ని చెప్పారు.

త‌న ద‌ర్శ‌క‌త్వం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేద‌ని అందుకే సత్య‌గ్ర‌హి సినిమా చేసి నిర్మాత‌ల డ‌బ్బులు వేస్ట్ చేయ‌న‌ని ప‌వ‌న్ ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గారే ఆ సినిమాను ఆపేశార‌ని చెప్పారు. అంతే కాకుండా లోక్ నాయ‌క్ జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ కాలంలో విధించిన ఎమర్జెన్సీ స‌మ‌యంలోని ప‌రిస్థితుల ఆధారంగా ఆ సినిమా స్క్రిప్ట్ ను సిద్దం చేశార‌ని చెప్పారు.

ALSO READ: 62 వెడ్స్ 21…ముస‌లాడే కానీ మ‌హానుభావుడు..!

Visitors Are Also Reading