Home » జక్కన్న,మహేష్ కాంబోలో మూవీ..కథ ఎలా ఉండబోతుందంటే..?

జక్కన్న,మహేష్ కాంబోలో మూవీ..కథ ఎలా ఉండబోతుందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ లెజెండరీ డైరెక్టర్ జక్కన్న సినిమాలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలుసు. ఆయన సినిమా ఛాన్స్ కోసం ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు వారి కెరియర్ మారిపోతుందని భావిస్తూ ఉంటారు.. అలాంటి దర్శక ధీరుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా అంటే అది ఏ లెవెల్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు..

Advertisement

also read:ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా పోస్ట‌ర్ లో ఇంత మ్యాట‌ర్ ఉందా..? అంటే అర్థం ఏంటంటే..?

వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతుందని ఇప్పటికే అనౌన్స్ అయింది. రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందిస్తున్నారట.. మహేష్ బాబుకు 29వ ప్రాజెక్ట్ అవడంతో ” ఎస్ఎస్ఎంబీ 29″ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్ కూడా వచ్చింది.. ఆర్ఆర్ఆర్ మూవీ హిట్ తర్వాత జక్కన్న, మహేష్ బాబుని ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయంపై తాజాగా విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. వారి సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Advertisement

చాలా రోజుల నుంచి రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ కథతో కూడిన మూవీ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు అవకాశం రాలేదు.. ఈ తరుణంలో ఇలాంటి స్టోరీకి మహేష్ బాబు బాగా సూట్ అవుతారని భావించారు. మహేష్ బాబు ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయి యాక్టింగ్ చేయగలడు. అందుకే మహేష్ బాబును ఓకే చేశాడు రాజమౌళి అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మే లేదా జూన్ లో మొదలవుతుందని తెలియజేశారు.. ఈ విషయం బయటకు రావడంతో మహేష్ బాబు అభిమానులంతా ఎంతో సంబరపడిపోతున్నారని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading