Home » ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..? బ‌య్య‌ర్ల డిమాండ్ పై పూరీ ఫైర్ ఆడియో వైర‌ల్..!

ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..? బ‌య్య‌ర్ల డిమాండ్ పై పూరీ ఫైర్ ఆడియో వైర‌ల్..!

by AJAY
Ad

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా తెర‌కెక్కిన‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి చార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెర‌కెక్కించారు. సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైక్ టైసన్ ముఖ్యమైన పాత్రలో నటించారు.

Advertisement

అలా భారీ అంచనాల నడుమ‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిన‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ లు నష్టపోయారు. దాంతో పూరి జగన్నాథ్ కొంతమందికి డబ్బులను తిరిగి ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పూరి జగన్నాథ్ ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఆడియోలో పూరి జగన్నాథ్ బయ్యర్స్ పై ఫైర్ అవుతున్నారు. పూరి జగన్నాథ్ ఫోన్ కాల్ లో మాట్లాడుతూ…. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇస్తున్నాను ఎందుకు, పాపం వాళ్లు కూడా నష్టపోయారు లే అని.

Advertisement

ఆల్రెడీ బ‌య్య‌ర్స్ తో మాట్లాడటం జరిగింది. మరో నెలలో ఒప్పుకున్న డబ్బు మొత్తాన్ని ఇస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా అతి చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు. ఎందుకు ఇస్తున్నాం పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తీయాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం.

కొన్ని సినిమాలు ఆడ‌తాయి… కొన్ని పోతాయి. పోకిరి దగ్గర నుండి ఇస్మార్ట్ శంకర్ వరకు బ‌య్య‌ర్ల‌ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎంతో ఉన్నాయి. బ‌య్య‌ర్స్ అసోసియేషన్ నాకు ఆ డబ్బును తిరిగి ఇస్తుందా..? ధర్నా చేస్తామంటున్నారు చేయండి. ధర్నా చేసిన వాళ్ల లిస్ట్ తీసుకుని వాళ్ళకి తప్ప మిగతా వాళ్లకు డబ్బులు ఇస్తాను. అంటూ పూరి జగన్నాథ్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading