జయం సినిమాతో టాలీవుడ్ కు విలన్ గా పరిచయమైన గోపిచంద్ ఆ తరవాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి గోపిచంద్ తొలివలపు సినిమాతో హీరోగా మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. ఆ తరవాత జయం వర్షం సినిమాలలో విలన్ గా నటించి మెప్పించారడు.
ఇక గోపించంద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించగా అతడిని హీరోగా నిలబెట్టిన సినిమా యజ్ఞం. సినిమాలోని యాక్షన్ సీన్ లు మాస్ లుక్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేశాయి. ఈ సినిమా కు ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. అయితే యజ్ఞం సినిమాకు మొదట హీరోగా అనుకున్నది మాత్రం గోపించంద్ ను కాదు.
ఈ సినిమా ను ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ హీరో మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు మొదట యజ్ఞం సినిమా ఆఫర్ వచ్చింది. ప్రభాస్ కు కథ తెగనచ్చేసింది. కానీ ఈ సినిమాకు దర్శకుడు రవికుమార్ చౌదరి కాకుండా బిగోపాల్ దర్శకత్వం వహించాలని ప్రభాస్ కండిషన్ పెట్టాడు.
దాంతో దర్శకనిర్మాతలు ఈ సినిమా ఆఫర్ ను గోపించద్ కు ఇచ్చారు. కథ విన్న గోపించంద్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రభాస్ ఈ సినిమాను వదులుకుని సూపర్ హిట్ ను మిస్ చేసుకోగా ఆ అదృష్టం గోపిచంద్ ను వరించి హీరోగా సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగగా…గోపిచంద్ కు కూడా టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.