Home » “రాధేశ్యామ్” విడుద‌ల‌పై మూవీ మేక‌ర్స్ ఏమ‌న్నారంటే..?

“రాధేశ్యామ్” విడుద‌ల‌పై మూవీ మేక‌ర్స్ ఏమ‌న్నారంటే..?

by Bunty
Ad

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, పూజాహెగ్దే జంట‌గా క‌లిసి న‌టిస్తున్న చిత్రం రాధేశ్యామ్ ప్ర‌స్తుతం తెలుగులో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌ల‌లో ఇది కూడా ఒక‌టి. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాను పలు వాయిదాల అనంతరం 2022 జనవరి 14న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఒకసారి కరోనా కారణంగా ‘రాధేశ్యామ్’ విడుదలలో ఆలస్యం జరిగింది. తాజాగా కొత్త విడుద‌ల తేదీని ప్రకటించినప్పటికీ భారీ సినిమాల క్లాష్ కారణంగా ‘రాధేశ్యామ్’ మరోసారి వాయిదా అంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి.

Advertisement

Advertisement

అయితే ఆ వార్తలన్నీ కొట్టి పారేస్తూ ‘రాధేశ్యామ్’ జనవరి 14న కన్ఫర్మ్ చేశారు చిత్ర నిర్మాతలు. అయితే అంతా ఓకే అనుకుని, సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్ సినీ ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ కారణంగా ఢిల్లీలో థియేటర్లు మూసివేశారు.

ముఖ్యంగా ఢిల్లీలో, మహారాష్ట్రలోని ముంబై, కర్ణాటక, తమిళనాడులో రాత్రిపూట కర్ఫ్యూలతో పాటు కేవలం 50% ఆక్యుపెన్సీ ఉండడంతో ‘రాధేశ్యామ్’ వెనక్కి తగ్గుతుందని తాజాగా జోరుగా ప్రచారం జరుగుతోంది. శ‌నివారం ఉదయం నుంచి ‘హ్యాపీ న్యూఇయర్’ కంటే ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు పోస్ట్ పోన్ అంటూ ట్రెండ్ అవుతోంది. అయితే గాసిప్స్ అన్నింటికీ చెక్ పెట్టేసారు ‘రాధేశ్యామ్’ మేకర్స్. తాజాగా విడుద‌ల‌కు సంబంధించిన డేట్ తో కొత్త పోస్టర్ ను విడుదల చేసి సినిమా పోస్ట్ పోన్ అంటూ ప్రచారం చేస్తున్న అందరి నోళ్లను మూయించారు.

 

 

Visitors Are Also Reading