Home » బాలకృష్ణ ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు…కానీ YSR కాపాడారు – పోసాని సంచలనం

బాలకృష్ణ ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు…కానీ YSR కాపాడారు – పోసాని సంచలనం

by Bunty

బాలయ్య, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పోసాని కృష్ణ మురళీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు… అప్పుడు పురందేశ్వరి వేడుకుంటే వైఎస్ఆర్ కాపాడారని పేర్కొన్నారు పోసాని కృష్ణమురళి. ఇవాళ చంద్రబాబు అరెస్ట్‌…ఏపీ రాజకీయాలపై మీడియాతో పోసాని కృష్ణ మురళీ మాట్లాడారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ…పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అవ్వగానే జగన్ ను తిట్టడం మొదలు పెట్టింది…బాబు అరెస్ట్ అవ్వగానే ప్రెస్ మీట్ పెట్టి జగన్ ని తిట్టిందని ఫైర్ అయ్యారు.

posani Comments on Balakrrishna

posani Comments on Balakrishna

బాలకృష్ణ తన రివాల్వర్ తో ఇద్దరిని కాల్చాడని…ఆ సమయంలో భయపడి పురంధరేశ్వరి దగ్గరికి ఏడుస్తూ బాలకృష్ణ…వచ్చాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత పురంధరేశ్వరి, వెంకటేశ్వర్ రావు ఇద్దరు వైఎస్ దగ్గరికి వచ్చారని…మా తమ్ముడు ఇద్దరిని కాల్చాడు అన్నయ్య అని వైఎస్ కాళ్ల మీద పడిందని చెప్పుకొచ్చాడు. దాంతో బాలకృష్ణతో సెల్ లో పెట్టకుండా వైఎస్ కాపాడారు… ఓ ఆడపిల్ల తన దగ్గర ఏడ్చిందని వైఎస్‌ఆర్‌ అలా చేశాడని వివరించారు పోసాని కృష్ణ మురళీ.

చంద్రబాబు అరెస్ట్ అవ్వడానికి జగనే కారణమని… అసలు బాబు తప్పేం లేదని పురంధరేశ్వరి అంటున్నారు…మా బంధువు అవినీతి చేయలేదు… అంతా వైసీపీ ప్రభుత్వమే చేసిందని పురంధరేశ్వరి అంటుందని నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవినీతి గురించి మీ నాయకుడు మోడీనే చెప్పాడు…చంద్రబాబు అవినీతిలో నెంబర్ వన్, కేడీ అని మోడీ అన్నారని గుర్తు చేశారు పోసాని కృష్ణ మురళీ. క్రిమినల్స్ ని కాపాడటం మీ మెంటాలిటీనా.? ఎన్ని సార్లు, ఎన్ని పార్టీలు మారుతారు మేడం…అంటూ పురందేశ్వరీని ఉద్దేశించి నిప్పులు చెరిగారు.

https://x.com/TeluguScribe/status/1705523676924576015?s=20

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading