మాయాజాలం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూనమ్ కౌర్. కానీ ఆ తరవాత పూనమ్ కౌర్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో సినిమాల్లో సెకండ్ హీరోయిన్ తో పాటూ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించింది. ఇదిలా ఉంటే పూనమ్ కౌర్ ఆ తరవాత వివాదాల్లో చిక్కుకుని పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. కానీ ఎప్పుడూ ఏదో ఒక అంశంతో పూనమ్ కౌర్ వార్తల్లో నిలుస్తోంది.
Advertisement
ఇదిలా ఉండగా ఇప్పుడు పూనమ్ కౌర్ నాతిచరామి అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా మార్చి 10న పలు ఓటీటీ ప్లాట్ ఫాం లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూనమ్ కౌర్ భావోద్వేగానికి లోనైంది. చాలా రోజుల తరవాత మీడియా ముందుకు రావడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చెప్పింది.
Advertisement
తాను పూర్తిగా సినిమాలను వదిలి వెళ్లిపోవాలనుకున్నట్టు పేర్కొంది. 2017,18 సంవత్సరాల టైం లో తాను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోవాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలిపింది. తన జీవితాన్ని సినిమానే మార్చేసిందని….దేశం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా అంటూ వ్యాఖ్యానించింది.
కానీ కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రియలైజ్ అయ్యానని పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిరోజూ తనను తాను సీతాదేవి ద్రౌపతి లా తలుచుకునేదాన్నని పేర్కొంది. మధ్య తరగతి అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయని అందులో ఒకటి పెళ్లి అని తెలిపింది. కానీ కొందరు తన పెళ్లి కలను చెదరగొట్టారు అని పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యింది.