Home » పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేష్…!

పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేష్…!

by AJAY
Published: Last Updated on

టాలీవుడ్ న‌టి ప‌విత్ర‌లోకేష్ పోలీసుల‌ను ఆశ్రయించారు. త‌న పేరుతో కొంత‌మంది న‌ఖిలీ ఖాతాల‌ను తెరిచార‌ని ఆరోపిస్తూ ప‌విత్ర లోకేష్ సైబ‌ర్ క్రైం పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. కొంత‌మంది త‌న పేరిట న‌ఖిలీ సోష‌ల్ మీడియా అకౌంట్ ల‌ను క్రియేట్ చేశార‌ని అంత‌టితో ఆగ‌కుండా త‌న పేరు ప్ర‌తిష్ట‌లకు భంగం క‌లిగేవిధంగా అస‌భ్య‌క‌ర‌మైన పోస్ట్ లు పెడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అదే విదంగా ఆ ఫేక్ అకౌంట్ ల ద్వారా ఫేక్ వార్త‌ల‌ను ప్రచారం చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప‌విత్ర లోకేష్ ఫిర్యాదు మేర‌కు సైబ‌ర్ క్రైం పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా ప‌విత్ర లోకేష్ ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

అయితే గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్ న‌టుడు వీకే న‌రేష్ తో ప‌విత్ర లోకేష్ స‌హ‌జీవ‌నం చేస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. కానీ ఈ వార్త‌ల‌పై అటు ప‌విత్ర లోకేష్ కానీ ఇటు న‌రేష్ కానీ స్పందించ‌లేదు.

Visitors Are Also Reading