Dhootha Movie : నాగచైతన్య లేటెస్ట్ గా నటించిన సిరీస్ ‘దూత’. ఈ సిరీస్ ఓటీటీలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఈ సిరీస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పార్వతీ తిరువత్తు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ డిసిపి క్రాంతిగా తన అద్భుతమైన నటన, ధైర్యం, హుందాతనంతో, తన బాడీ లాంగ్వేజ్ తో ఈ సిరీస్ కే హైలైట్ గా నిలిచింది ఈ అమ్మడు.
మలయాళ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి పార్వతి 2006 సంవత్సరంలో తన సినీ కెరీర్ ని ప్రారంభించి ఇప్పటివరకు తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటుంది. ఈ 17 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. పార్వతీ కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ, కన్నడ భాష చిత్రాల్లోనూ నటించింది.
Advertisement
ఇక దూత వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమైంది పార్వతీ తిరువత్తు. తాను నటించిన మొదటి సిరీస్ తోనే తెలుగు అభిమానుల మనసులను సొంతం చేసుకుంది ఈ మలయాళీ భామ. ఈ సిరీస్ అనంతరం తనకు తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక పార్వతి టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!