డునెడిన్లో జరిగిన 3వ T20I సమయంలో మహ్మద్ రిజ్వాన్ చేసిన షార్ట్ రన్ గురించి శిఖర్ ధావన్ మూడు పదాల్లో వివరించాడు. సాహసోపేతమైన ప్రయత్నం చేసినప్పటికీ నాన్-స్ట్రైకర్ ఎండ్లో రిజ్వాన్ తన గ్లౌస్లను క్రీజు దాటికి తీసుకురావడంలో విఫలమవడంతో, ధావన్ దానిని కబడ్డీతో సమం చేసి, ‘కబడ్డీ కబడ్డీ కబడ్డీ’ అని రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. 194 పరుగుల పరుగుల వేటలో 6వ ఓవర్లో రిజ్వాన్ ఆన్-సైడ్లో మాట్ హెన్రీ వేసిన బంతిని నడ్జ్ చేయడంతో ఈ సంఘటన జరిగింది. అయితే, 31 ఏళ్ల అతను బ్యాలెన్స్ కోల్పోయాడు మరియు దాదాపు పడిపోయాడు, ఆ ప్రాసెస్ లో బ్యాట్ ని కూడా కోల్పోయాడు.
అయినప్పటికీ, అతను బ్రేస్ తీసుకునే అవకాశం కోసం ప్రయత్నించాడు. కానీ బ్యాట్ అక్కడ లేకపోవడంతో కొంచెం సాగదీయవలసి వచ్చింది. రీప్లేలో, రిజ్వాన్ క్రీజుకు రెండు సెంటీమీటర్ల ముందు నేలను తాకినట్లు తేలింది. కబడ్డీలో జట్టులోని ఒక ఆటగాడు క్యాచ్ పట్టే ముందు ప్రత్యర్థి జట్టు లైన్ను తాకాల్సిన అవసరం ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే.. ధావన్ తన పోస్ట్ లో “కబడ్డీ కబడ్డీ కబడ్డీ” అంటూ కాప్షన్ ను జత చేసారు.
శిఖర్ ఎంత స్పోర్టివ్ పర్సన్ అన్నది అతని అభిమానులకు తెలిసిందే. సీరియస్ గా సాగుతున్న గేమ్ తో తన సరదా పోస్ట్ తో క్రికెట్ లో కొత్త ఉల్లాసాన్ని తీసుకొచ్చాడు. తన ప్రత్యర్థిని సరదాగా టాగ్ చేసి, సరదా ట్రోల్ తో ఎటాక్ చేయడంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అతనికి ఆట పట్ల ఉన్న ప్రేమని, అతని లోని ఉత్సాహాన్ని ఈ ట్వీట్ లోనే మనం చూడొచ్చు.