Home » ఎన్టీఆర్ కు అందిన అయోధ్య రామమందిర ఉత్సవ ఆహ్వానం.. కానీ డుమ్మా కొట్టేస్తున్న తారక్.. ఎందుకంటే?

ఎన్టీఆర్ కు అందిన అయోధ్య రామమందిర ఉత్సవ ఆహ్వానం.. కానీ డుమ్మా కొట్టేస్తున్న తారక్.. ఎందుకంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

దేశవ్యాప్తంగా అందరికీ రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానం అందుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరు కావాల్సిందిగా ఆర్ ఆర్ ఆర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఆహ్వానం అందింది, అయితే నటుడు దీనికి హాజరు కాలేరని తెలుస్తోంది. జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామమందిరానికి ప్రతిష్ఠాపన జరగనుంది.ఈ మెగా ఈవెంట్‌లో క్రికెట్ ప్రపంచం నుంచి భారతీయ నటీనటుల వరకు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

jrntr

Advertisement

 

రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నా రోజే ఎన్టీఆర్ ప్రతిషాత్మకంగా భాగం అయిన దేవర పార్ట్ 1 చిత్రం షూటింగ్ జరగనుంది. దీని కారణంగా ఎన్టీఆర్ ఈ ఉత్సవానికి హాజరు కాలేరని తెలుస్తోంది. దేవర: పార్ట్ 1 టీమ్ ఎట్టి పరిస్థితిల్లో ఈ సినిమాను ఏప్రిల్ 5, 2024కి విడుదల చెయ్యాలని నిర్ణయించుకుంది. విడుదలకు ఇంకా మూడు నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున, జూనియర్ ఎన్టీఆర్ మరియు బృందం సమయాన్ని వృథా చేయకూడదనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

దేవర: పార్ట్ 1లో తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్న జాన్వీ కపూర్.. ఈ సినిమా తోనే కన్నడ అరంగ్రేటం కూడా చేస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ రచన మరియు దర్శకత్వం వహించారు. పలువురు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నటీనటులకు కూడా రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానాలు పంపబడ్డాయి. రజినీకాంత్, ప్రభాస్, రిషబ్ శెట్టి, చిరంజీవి, రామ్ చరణ్, యష్, ధనుష్, మోహన్‌లాల్‌లకు గత కొద్దిరోజుల క్రితమే ఆహ్వానం అందింది. రణబీర్ కపూర్, అలియా భట్, జాకీ ష్రాఫ్ మరియు టైగర్ ష్రాఫ్ వంటి పలువురు బాలీవుడ్ నటులకు కూడా ఈ ఆహ్వానం అందజేయబడింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading