సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో వద్దకు వెళ్లిన కథను ఆ హీరో రిజెక్ట్ చేస్తే మరో హీరో చేసి సూపర్ హిట్ అందుకోవడం సహజమే. అలా ప్రతి ఒక్క స్టార్ హీరో కెరియర్ లోనూ ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం అలాంటి సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నారని తాజాగా తెలిసింది. ఆట డ్యాన్స్ షో ద్వారా అమ్మ రాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
ఈ డ్యాన్స్ షోలో అమ్మ రాజశేఖర్ జడ్జ్ గా వ్యవహరించింది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకు అమ్మ రాజశేఖర్ కొరియోగ్రఫీ చేశారు. కేవలం కొరియోగ్రఫీకి పరిమితం కాకుండా దర్శకత్వం వైపు సైతం అడుగులు వేశారు. ఆ సమయంలో తాను జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కథను వినిపించానని అమ్మ రాజశేఖర్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Advertisement
మొదటగా రణం సినిమా స్క్రిప్ట్ ను తాను ఎన్టీఆర్ కి చెప్పానని అమ్మ రాజశేఖర్ అన్నారు. సినిమాలో ఒక సీన్లో హీరో విలన్ ముందు చేతులు కట్టుకుని కూర్చోవాల్సి ఉంటుందని… కాబట్టి ఆ సినిమా ఎన్టీఆర్ రేంజ్ కు సరిపోదని ముందే అనిపించిందని చెప్పారు. ఇక ఎన్టీఆర్ కూడా సినిమా కథ విని బాగుంది కానీ ఈ కథకు గోపీచంద్ బాగా సెట్ అవుతాడని సలహా ఇచ్చినట్టు తెలిపారు.
దాంతో తాను సంతోష్ శ్రీనివాస్ ద్వారా గోపీచంద్ కు కథ వినిపించానని చెప్పారు. ఇక గోపీచంద్ కు కూడా కథ నచ్చడంతో సినిమా పట్టలెక్కిందని అన్నారు. అలా వచ్చిన రణం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిందని చెప్పారు. ఇక రణం తర్వాత అమ్మ రాజశేఖర్ తానే హీరోగా రణం -2 ను తెరకెక్కించారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. అంతేకాకుండా అమ్మా రాజశేఖర్ పలు చిత్రాలకు దర్శకత్వం వచ్చినా రణం తప్ప మరో హిట్ పడలేదు.