టాలీవుడ్ లోని బడా బ్యానర్ లలో వైజయంతీ మూవీస్ బ్యానర్ కూడా ఒకటి. ఒకప్పుడు ఇది టాలీవుడ్ లో నంబర్ వన్ బ్యానర్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు చాలా మందిని వైజయంతి బ్యానర్ పైనే హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ కోన్నేళ్లుగా ఈ బ్యానర్ నుండి పెద్దగా సినిమాలు రాలేదు. కానీ జాతిరత్నాలు సినిమాతో మళ్లీ నిర్మాణ రంగంలో రాజీ లేదని నిరూపించుకుంది. ఇక రీసెంట్ గా సీతారామం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Advertisement
అంతే కాకుండా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కే పేరుతో పాన్ వరల్డ్ సినిమాను నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే వైజయంతీ మూవీస్ బ్యానర్ బాధ్యతలను ప్రస్తుతం అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ చూసుకుంటున్నారు. ఇప్పటికే నిర్మాతగా స్వప్నదత్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు. రీసెంట్ గా సీతారామం సినిమా హిట్ అవ్వడంతో స్వప్నదత్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
Advertisement
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వప్నదత్ ఆసక్తికర నిజాలను బయటపెట్టారు. ఎన్టీఆర్ తన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ను వైజయంతీ మూవీస్ బ్యానర్ లోనే చేశారు. అంతే కాకుండా అదే బ్యానర్ లో శక్తి సినిమాలో నటించారు. శక్తి సినిమాలో నటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ కు అశ్వినిదత్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అంతే కాదు తన పెళ్లి జరగటానికి ఎన్టీఆర్ కారణం అంటూ స్వప్నదత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తాను ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని ప్రేమించానని ఆ విషయం ఇంట్లో చెప్పడానికి బయపడ్డానని స్వప్నదత్ తెలిపారు. తన తండ్రికి చెప్పలేక సతమతం అవుతూ ఒక స్టేజ్ లో ప్రేమను విడిచిపెడదామనుకే స్థాయికి వచ్చామని తెలిపారు. ఆ విషయం ఎన్టీఆర్ కు తెలియడంతో ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్ అయిపోగానే మేకప్ కూడా తీయకుండా వచ్చి ప్రేమవిషయాన్ని తన తండ్రి అశ్విని దత్ కు చెప్పారని పేర్కొంది. దాంతో తన తండ్రి కూడా పెళ్లికి ఒప్పుకున్నాడని ఆనందం వ్యక్తం చేసింది. అలా ఎన్టీఆర్ తన లైఫ్ లో మర్చిపోలేని హెల్ప్ చేశారని తెలిపింది.
AlSO READ : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. త్వరలోనే స్క్రీన్షాట్ బ్లాక్..!