Home » ఆహ్వానం అందినా మీటింగ్ కు వెళ్ల‌ని ఎన్టీఆర్..కార‌ణం అదేనా…!

ఆహ్వానం అందినా మీటింగ్ కు వెళ్ల‌ని ఎన్టీఆర్..కార‌ణం అదేనా…!

by AJAY
Ad

గ‌త కొంత‌కాలంగా ఏపీలో సినిమా టికెట్ల వివాదం కొన‌సాగుతూనే ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవితో సీఎం జ‌గ‌న్ స‌మావేశం కాగా నేడు మ‌రోసారి సీఎం చిరంజీవితో స‌మావేశం అవుతున్నారు. అయితే ఈ సారి చిరంజీవితో పాటూ ప్ర‌భాస్, మ‌హేశ్ బాబు,రాజ‌మౌళి, కొర‌టాల శివ కూడా ఈ స‌మావేశానికి హాజ‌ర‌వుతున్నారు. అయితే సీఎం జ‌గ‌న్ తో స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని పోసాని కృష్ణ ముర‌ళి, నాగార్జున‌, ఎన్టీఆర్ ల‌కు కూడా ఆహ్వానం అందిన‌ట్టు స‌మాచారం.

Advertisement

Advertisement

 

కాగా నాగార్జున కూడా ఈ స‌మావేశానికి హాజ‌రుక‌వాల్సి ఉంది కానీ నాగార్జున స‌తీమ‌ణి అమ‌ల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. దాంతో నాగార్జున ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ స‌మావేశానికి దూరంగా ఉండ‌టం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

May be an image of 5 people, people standing and flower

అయితే ఎన్టీఆర్ వ్య‌క్తి గ‌త కార‌ణాల వ‌ల్ల‌నే స‌మావేశానికి దూరంగా ఉన్నారు అంటూ ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. ఇక ప్ర‌స్తుతం ఈ స‌మావేశం జ‌రుగుతుండ‌గా నిన్న‌నే మంత్రి పేర్నినాని ఈ స‌మావేశం పై సీఎంతో భేటీ అయ్యి చ‌ర్చించారు.

Also Read: జైలు జీవితం గ‌డిపిన సుమ‌న్‌కు పిలిచి పిల్ల‌నిచ్చిన దిగ్గ‌జం ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading