విజయవాడ రాజకీయాల్లో మరోసారి హీట్ మొదలైంది. విజయవాడ ఎంపీ టికెట్ ను మరోసారి ఆశిస్తున్న కేశినేని నానికి టీడీపీ షాక్ ఇచ్చినట్లు అర్థమవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా నానినే ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. జనవరి 7వ తేదీన తిరువూరులో టీడీపీ భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తుంది. ఈ సభ నిర్వహణ విషయంలో నాని సైలెంట్ గా ఉండాలంటూ చంద్రబాబు ఆదేశించారని కొంతమంది టీడీపీ నేతలు ఆయనకు చెప్పారట.
ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పోస్టులో రాసుకున్నారు కేశినేని నాని. అంతేకాదు విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించిందని, అందుకే అతడిని సైలెంట్ గా ఉండాలని పార్టీ అధినేత ఆదేశించారని, ఆయన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తానంటూ పెద్ద బాంబు పేల్చారు కేశినేని నాని. ఇతనికి బదులు విజయవాడ ఎంపీ టికెట్ ను ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది.
Advertisement
ఇటీవల కాలంలో ఇరు వర్గాలు తరచుగా గొడవలు కూడా పడుతూ హల్చల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అసలు ఇష్టపడని కేసినేని నాని ఇప్పుడు ఫేస్బుక్ పోస్ట్ పెట్టడంతో ఆయనకు టికెట్ నిరాకరించారు అన్న విషయం స్పష్టమైనట్లే అని అర్థమవుతుంది. అయితే…విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వకపోతే.. వైసీపీలోకి కేశినేని నాని వెళతారని చర్చ జరుగుతోంది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!