Home » భారత జట్టులో నో ఛాన్స్.. సెలెక్టర్లకు సరైన సమాధానమిచ్చిన రింకూ..!

భారత జట్టులో నో ఛాన్స్.. సెలెక్టర్లకు సరైన సమాధానమిచ్చిన రింకూ..!

by Anji
Ad

ఐపీఎల్ 2023లో అదురగొట్టిన యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మలకు టీ-20లకు చోటు దక్కిన విషయం తెలిసిందే. వెస్టిండిస్ తో జరుగబోయే టీ-20 సిరీస్ కి వీరిద్దరూ ఎంపికయ్యారు. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో తనదైన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ రింకూసింగ్ కి మాత్రం సెలెక్టర్లు మొండిచేయి చూపించారు. రింకూసింగ్ జట్టును ఎంపిక చేసిన 24 గంటల్లోనే సెలెక్టర్లకు తన బ్యాట్ తో గట్టిగా సమాధానమిచ్చాడు.

Advertisement

ప్రస్తుతం రింకూసింగ్ దులీప్ ట్రోపీలో సెంట్రల్ జోన్ తరుపున ఆడుతున్నాడు. అతని మొదటి ఇన్నింగ్స్ లో 48 పరుగులు చేశాడు. ఇదేంటి.. ఈ ఇన్నింగ్స్ తోనే సెలెక్టర్లకు సమాధానం ఇచ్చాడా..? అని  అనుకోవచ్చు. దులీప్ ట్రోపీ సెమీ ఫైనల్స్ లో వెస్ట్ జోన్ తో జరుగుతున్న మ్యాచ్ లో సెంట్రల్ జోన్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 128 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో రింకూసింగ్ 48 పరుగులున్నాయి. బౌలర్లకు ఎంతగానో సహకరించే పిచ్ పై రింకూ చివరి వరకు తన అద్భుతమైన టెక్నిక్ తో ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తానికి 69 బంతుల్లో 48 పరుగులు చేసాడు.

Advertisement

సూర్యకుమార్ యాదవ్, పుజారా, సర్ఫరాజ్ వంటి ప్లేయర్స్ ఈ పిచ్ పై పూర్తిగా విఫలం చెందినప్పటికీ రింకూసింగ్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్, చతేశ్వర్ పుజారా, సర్ఫరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ తరుపున ఆడుతుండగా.. ఈ ముగ్గురు ఆటగాళ్లు రింకూసింగ్ చేసినంత పరుగులు రాబట్టలేకపోవడం గమనార్హం.  మొదటి ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు మాత్రమే చేయగా.. సర్పరాజ్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. పుజారా 28 పరులకు ఔట్ అయ్యాడు. దీనిని బట్టి చూస్తే ముగ్గురు ఆటగాళ్లు విఫలమైన పిచ్ పై కేవలం రింకూ సింగ్ మాత్రమే తన సత్తా ఏంటో చాటాడు అని స్పష్టం అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 టాలీవుడ్ లోని టాప్ హీరోల ఫస్ట్ పారితోషికం ఎంతో తెలుసా..? 

ఓటీటీలోకి వచ్చేసిన అజయ్ చక్రవ్యూహం.. ఎక్కడ చూడొచ్చంటే..? 

ప్రముఖ కమెడియన్ యోగిబాబు ఒక్కరోజు పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading