టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మ్యాస్ట్రో హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమా ఓటిటిలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నితిన్ ఓన్ బ్యానర్ పై సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నితిన్ కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా పూర్తవ్వగానే నితిన్ మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు.
Advertisement
Advertisement
వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జూనియర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఠాగూర్ మధు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా వక్కంతం వంశీ రైటర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. తన కథలతో సూపర్ హిట్ లు ఇచ్చాడు. కానీ అల్లు అర్జున్ హీరోగా తీసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో వకంతం వంశీ తో సినిమా చేసి రిస్క్ అవసరమా అంటూ నితిన్ అభిమానులు అనుకుంటున్నారు.