Home » Newsense : ‘న్యూసెన్స్’ ట్రైలర్.. మీడియాను టార్గెట్ చేశారా?

Newsense : ‘న్యూసెన్స్’ ట్రైలర్.. మీడియాను టార్గెట్ చేశారా?

by Bunty
Ad

టాలీవుడ్ హీరో నవదీప్ మరియు బిందు మాధవిల కలయికలో ప్రవీణ్ కుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ న్యూసెన్స్. మీడియా రంగంలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ యాక్షన్ త్రిల్లింగ్ హంగులతో తెరకెక్కింది ఈ వెబ్ సిరీస్. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన టీజర్లు, పోస్టుర్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై నిర్మిస్తున్నారు.

read also : త్రిష ప్రియుడితో డేటింగ్ లో ఉన్నా : బిందు మాధవి

Advertisement

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. ‘ఇక్కడ ఎవడి సొమ్ము ఎవడు తినడం లేదు… ఎవరి దమ్ము వాడిదే’ అంటూ వినిపిస్తున్న సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూస్తుంటే మీడియా రంగాన్ని ఉద్దేశించి ఈ సిరీస్ ను తెరకెక్కించినట్లు అర్థం అవుతుంది. కాగా, మే 12 ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదలైన ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శనివారం నాడు హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు.

Advertisement

Read Also : Pushpa 2 : పుష్ప-2లో మెగా డాటర్‌.. సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..!

Newsense Trailer Launch Event Photos Goes Viral - Sakshi

ఈ ప్రెస్ మీట్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హీరోయిన్ బిందు మాధవిపై వచ్చిన ఒకే ఒక రూమర్ పై యాంకర్ ఓ ప్రశ్న అడిగింది. త్రిష బాయ్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ లో ఉన్నారని రూమర్ వచ్చింది. అది నిజమా కాదా అని యాంకర్ అడగటంతో… దాటవేత ధోరణిలో కాకుండా చాలా సూటిగా ఆన్సర్ ఇచ్చింది బిందు మాధవి. అవును నిజమే. కానీ వేర్వేరు సందర్భాల్లో అది జరిగింది. ఒకే టైంలో ఇద్దరం చేయలేదు. త్రిషతో బ్రేకప్ అయిన తర్వాత నాతో డేట్ నిజాన్ని ఒప్పుకోవాలి తప్పదు… అంటూ నిర్మోహమాటంగా చెప్పేసింది బిందుమాధవి.

read also : ‘ఏజెంట్’ నిర్మాతలకు భారీ నష్టాలు… రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన అఖిల్!

Visitors Are Also Reading