Home » సరికొత్త వివాదం లో చిక్కుకున్న సాయి పల్లవి..! టాలీవుడ్ ఆమెను బ్యాన్ చేస్తుందా ?

సరికొత్త వివాదం లో చిక్కుకున్న సాయి పల్లవి..! టాలీవుడ్ ఆమెను బ్యాన్ చేస్తుందా ?

by AJAY
Ad

టాలీవుడ్ లోని హీరోయిన్ల‌లో సాయిప‌ల్ల‌వికి ఓ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ఇండ‌స్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ రూటే స‌ప‌రేటు. ఈ మ‌ల‌యాళ కుట్టి ఎక్స్పోజింగ్ కు దూరంగా ఉంటూనే వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంటుంది అంటే అది పూర్తిగా ఆమె టాలెంటే అని చెప్పుకోవాలి. ప్రేమ‌మ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయిప‌ల్ల‌వి ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. అంతే కాకుండా మొద‌టి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్ష‌కును ఫిదా చేసింది.

 

Advertisement

ఇక వ‌రుస ఆఫ‌ర్ లు అందుకుంటూ సాయిప‌ల్లవి లేడీ సూప‌ర్ స్టార్ గా ఎదిగింది. సాయిప‌ల్ల‌వి క‌ట్టుబొట్టు ఆమె పద్ద‌తిని చూసి ఇష్ట‌ప‌డేరావే ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా సాయిప‌ల్ల‌వి విరాట‌ప‌ర్వం అనే సినిమాలో హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాలో హీరోగా రానా న‌టించారు. ఈ సినిమా జూన్ 17న విడుద‌లకు సిద్దంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే రౌడీ బేబీ సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉంది.

Advertisement

అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా సాయిప‌ల్ల‌వి చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఇంట‌ర్వ్యూలో క‌శ్మీరీ ఫైల్స్ సినిమాకు సంబంధించి యాంక‌ర్ సాయిప‌ల్ల‌విని ప్ర‌శ్నించారు. దానికి సాయిప‌ల్ల‌వి….గోహ‌త్య‌ల‌కు క‌శ్మీరీపండిట్ ల హ‌త్య‌ల‌కు పెద్ద‌గా తేడాలేద‌ని వ్యాఖ్యానించింది.

SAIPALLAVI

రెండూ కూడా మతం ముసుగులో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాలేన‌ని వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని చెప్పింది. మ‌నుషుల‌ను మ‌నుషులుగా చూడాల‌ని మ‌తం రంగు పూయ‌వ‌ద్ద‌ని తెలిపింది. అయితే సాయిప‌ల్ల‌వి మాటల్లోని అర్థం ఏంటో ఎవ‌రికీ క్లారిటీ లేదు కానీ కొంత‌మంది మాత్రం రౌడీ బేబీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా బ్యాన్ సాయిప‌ల్ల‌వి..బ్యాన్ విరాట‌ప‌ర్వం అంటూ సోష‌ల్ మీడియాలో హాష్ టాగ్ ల‌ను ట్రెండ్ చేస్తున్నారు.

Visitors Are Also Reading