Home » కోహ్లీని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా ?

కోహ్లీని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా ?

by Anji
Ad

బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో భాగంగా నాగపూర్ లోని జమ్తా స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుతున్నవిషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు 177 పరుగులు చేసింది. ఆ జట్టుకు సమాధానంగా టీమిండియా 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 144 పరుగుల ఆధిక్యంలో  భారత జట్టు ఉంది. క్రీజులో ఉన్న ఆల్ రౌండర్స్ రవీంద్ర జడేజా 66 , అక్షర్ పటేల్ 52 పరుగులు చేశారు.  వీరిద్దరూ హాఫ్ సెంచరీలు సాధించడంతో 81 పరుగుల భాగస్వామ్యంతో దూసుకెళ్తూ ఉన్నారు. 

Advertisement

చాలా రసవత్తరంగా సాగుతున్న నాగపూర్ టెస్ట్ లో రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికరమైన ఘటన కనిపించింది. మ్యాచ్ చూసేందుకు ఓ ఫ్యాన్ ప్రదర్శించిన ప్లకార్డు అందరినీ ఆకర్షించింది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పై ప్రత్యేక అభిమానం చాటుకున్నాడు. ఎంతలా అంటే.. తాళి కట్టిన భార్యపై కంటే కోహ్లీనే అమితంగా ఇష్టపడుతున్నట్టు ప్లకార్డు ప్రదర్శించాడు. దీంతో నెటిజన్లు కూడా ఈ అభిమానిపై పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. 

Advertisement

https://twitter.com/collinsadam/status/

కోహ్లీ పై అభిమానం చాటుకున్న విషయం విధితమే. కానీ ఇంటికి వెళ్లాక బడిత పూజ ఉంటుంది భయ్యా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. క్రికెటర్ పై ప్రేమతో తాలి కట్టిన భార్యను అవమానిస్తావా బ్రో అంటూ మరో నెటిజన్ కామెంట్స్ చేసాడు. గతంలో కూడా ఇలాగే విరాట్ పై ప్రత్యేక అభిమానం చాటుకున్న అభిమానులు చాలానే ఉన్నారు. విరాట్ కోహ్లీ శతకం చేసేంత వరకు పెళ్లి చేసుకోనని ప్లకార్డు చూపించిన ఫ్యాన్ ఫొటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వాస్తవానికి కూడా కోహ్లీ సెంచరీ చేసిన తరువాతనే పెళ్లి చేసుకున్నటువంటి ఫోటోను ట్వీట్ చేశాడు.

Also Read :  రిషబ్ పంత్ చెంప పగలగొడతా : కపిల్ దేవ్

Visitors Are Also Reading