Home » ఆ విష‌యంలో మ‌హేశ్ బాబుతో గొడ‌వలు..ఓపెన్ గా చెప్పేసిన నమ్ర‌త‌..!

ఆ విష‌యంలో మ‌హేశ్ బాబుతో గొడ‌వలు..ఓపెన్ గా చెప్పేసిన నమ్ర‌త‌..!

by AJAY
Ad

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు మిస్ యూనివ‌ర్స్ మ‌రియు హీరోయిన్ న‌మ్ర‌త‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మ‌హేశ్ న‌మ్ర‌త క‌లిసి వంశీ అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌ర‌వాత న‌మ్ర‌త కుటుంబ స‌భ్యులు పెళ్లికి ఓకే చెప్పిన‌ప్ప‌టికీ కృష్ణ మాత్రం నో చెప్పారు. మ‌న సంప్ర‌దాయాలు తెలిసిన తెలుగ‌మ్మాయిని మ‌హేశ్ బాబుకు ఇచ్చి పెళ్లి చేయాల‌ని కృష్ణ అనుకున్నారు.

Advertisement

కానీ మ‌హేశ్ బాబు విన‌క‌పోవ‌డంతో చివ‌రికి కృష్ణ కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక అలా మ‌హేశ్ బాబు న‌మ్ర‌తలు ఒక్క‌ట‌య్యారు. పెళ్లి త‌ర‌వాత న‌మ్ర‌త సినిమాల‌కు పూర్తిగా దూరంగా ఉంది. అంతే కాకుండా మ‌హేశ్ బాబు కు సంబంధించిన వ్యాపారాలు చూసుకోవ‌డ‌మే కాకుండా కుటుంబ వ్య‌వ‌హారాల‌ను న‌మ్ర‌త చూసుకుంటున్నారు. మ‌రోవైపు మ‌హేశ్ బాబు డైట్ నుండి కాస్ట్యూమ్స్ వ‌ర‌కూ కూడా న‌మ్ర‌త ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు.

Advertisement

అలా టాలీవుడ్ లోనే అన్యోన్య‌మైన జంట‌గా మహేశ్ న‌మ్ర‌త ల జంట ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే న‌మ్ర‌త తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్లడించింది. మ‌హేశ్ బాబును పెళ్లి చేసుకోవ‌డ‌మే త‌న జీవితంలో బెస్ట్ మూమెంట్ అని చెప్పింది. పెళ్లి త‌ర‌వాత త‌న జీవిత‌మే మారిపోయింద‌ని న‌మ్ర‌త వ్యాఖ్యానించింది.

అంతే కాకుండా మాత్రుత్వాన్ని పొంద‌డం గొప్ప అనుభూతి అంటూ న‌మ్ర‌త వ్యాఖ్యానించింది. అంతే కాకుండా మీ ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గవా అంటూ యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా…పిల్ల‌ల విష‌యంలోనే గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించింది. పిల్ల‌లు ఏం కావాల‌న్నా తాను నో చెబుతాన‌ని కానీ మ‌హేశ్ ఒప్పుకుంటార‌ని తెలిపింది. దాంతో పిల్ల‌లు ఏం కావాల‌న్నా మ‌హేశ్ ను అడుగుతార‌ని న‌మ్ర‌త వెల్ల‌డించింది.

Visitors Are Also Reading