Home » నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ ల పెళ్ళికి ముందు ఎంత కథ జరిగిందో మీకు తెలుసా..?

నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ ల పెళ్ళికి ముందు ఎంత కథ జరిగిందో మీకు తెలుసా..?

by Azhar
Ad
టాలీవుడ్ లో ప్రస్తుతం దర్శకుడు నాగ్ అశ్విన్ ఎవరో తెలియని వారు ఉండరు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో 2015 లో దర్శకునిగా పరిచయమైన నాగ్ అశ్విన్ ఆ తర్వాత సావిత్రి గారి జీవిత కథ నేపధ్యంలో తీసిన మహానటి సూపర్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే నాగ్ అశ్విన్.. టాలీవుడ్ స్టార్  ప్రొడ్యూసర్ అశ్విని దత్ కుమార్తె అయిన ప్రియాంక దత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరి పెళ్ళికి ముందు పెద్ద కథే జరిగింది. అది తిస్తె ఓ సినిమా కూడా అవుతుంది.
అయితే అశ్విని దత్ గారి వైజయంతి బ్యానర్ కు టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. ఒక్కపుడు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీసిన అశ్విని దత్ గారు ఆ తర్వాత వయస్సు సహకరించకపోవడం వల్ల కొంచెం నెమ్మదించారు. ఆయన తర్వాత తన కూతురు ప్రియాంక దత్ ఒక్కరే ఈ బ్యానర్ ను నడిపిస్తున్నారు. కానీ ఆమె వచ్చిన తర్వాత చిన్న చిన్న సినిమాలను మాత్రమే నిర్మించారు. దాంతో వైజయంతి బ్యానర్ కొంచెం వెనుక బడింది. ఆ సమయంలోనే నాగ్ అశ్విన్ కు ప్రియాంకకు పరిచయం ఏర్పడింది.
వీరిద్దరూ కలిసి కొన్ని యాడ్స్ కూడా తీశారు. అప్పుడు అశ్విన్ ప్రియాంక కు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా కథ చెప్పడం.. అది ఆమెకు నచ్చి ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగిపోయింది. సినిమా మంచి విజయం సాధించిన తర్వాత ప్రియాంకకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. అప్పుడే అశ్విన్ ఊహించని విధంగా ప్రియాంకతో.. నీకు ఎవరైనా నచ్చితే సరే.. లేదంటే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. ఇక అప్పటికే అశ్విన్ గురించి అతని మంచి తనం గురించి తెలిసిన ప్రియాంక ఓకే చెప్పడంతో వీరి పెళ్లి జరిగిపోయింది.

Advertisement

Visitors Are Also Reading