Home » కోహ్లీ, రోహిత్ లను లెక్క చేయని సచిన్.. ఎందుకంటే…?

కోహ్లీ, రోహిత్ లను లెక్క చేయని సచిన్.. ఎందుకంటే…?

by Azhar
Ad
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిపోవడంతో చాల మంది మాజీ ఆటగాళ్లు.. క్రికెట్ దిగ్గజాలు తన ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో భారత మాజీ లెజెండ్ సచిన్ కుశ తన బెస్ట్ ఐపీఎల్ 2022 జట్టును ప్రకటించాడు. తన జట్టు ఓపెనర్లుగా జొస్ బట్లర్, అలాగే శిఖర్ ధావన్ ను ఎంచుకున్నాడు సచిన్. అయితే బట్లర్ ఈ ఏడాది బీకర ఫామ్ తో ఓరేంజ్ క్యాప్ పొందగా.. ధావన్ కూడా పంజాబ్ కింగే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇక తన వన్ డౌన్ బ్యాటర్ గా ఈ ఐపీఎల్ లో 600 లంజ పైగా పరుగులు చేసిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ను తీసుకోగా.. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లోకి హార్దిక్ పాండ్య ను ఎంచుకున్నాడు. అలాగే పాండ్యకు తన జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చాడు. అదే విధంగా ఈ ఐపీఎల్ లో అనూహ్యంగా రాణించిన డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్‌లకు కూడా జట్టులో స్థానం ఇచ్చిన సచిన్ ఫినిషర్ గా.. వికెట్ కీపర్ గా బెంగళూర్ ఆటగాడు దినేష్ కార్తీక్ ను తీసుకున్నాడు. అయితే ఐపీఎల్ 2022 లో కార్తీక్ ఫినిషర్ గా ఎలా సక్సెస్ అయ్యాడో మనం అందరం చూసాం.
అదే విధంగా బౌలింగ్ విషయాన్నికి వస్తే… ఈ ఐపీఎల్ లో అంతగా రాణించని బుమ్రాను ఎంచుకున్నాడు. అతనితో పాటుగా గుజరా స్టార్ బౌలర్ షమీని జట్టులోకి తీసుకున్నాడు సచిన్. అలాగే స్పిన్నర్లుగా ఈ ఐపీఎల్ 2022 లో పర్పుల్ క్యాప్ అందుకున్న యుజ్వేంద్ర చాహల్ తో పాటుగా గుజరాత్ ఛాంపియన్ గా నిలవడంలో ముఖ్య పాత్ర పోషించిన రషీద్ ఖాన్ ను తీసుకున్నాడు. అయితే సచిన్ జట్టులో పేరుమోసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి బ్యాటర్లతో పాటుగా స్టార్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన జడేజా వంటి ఆటగాళ్లకు కూడా స్థానం ఇవ్వలేదు. దీనిని బట్టే మన అర్ధం చేసుకోవచ్చు.. సచిన్ ఈ ఎంపిక కేవలం ప్రదర్శన పై ఆధారపడి మాత్రమే చేసాడు అని.

Advertisement

Visitors Are Also Reading