Home » “ముగ్గురు మొన‌గాళ్లు” సినిమాలో చిరుకు డూప్ లు గా న‌టించింది ఎవ‌రో తెలుసా..!

“ముగ్గురు మొన‌గాళ్లు” సినిమాలో చిరుకు డూప్ లు గా న‌టించింది ఎవ‌రో తెలుసా..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభిన‌యం చేసిన సినిమా ముగ్గురు మొన‌గాళ్లు. ఈ సినిమాకు మెగాబ్ర‌దర్ నాగ‌బాబు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. అంజ‌న ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ముందు మెగాస్టార్ ఘ‌రానా మొగుడు సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. ఇక ఈ సినిమాకు కూడా రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Advertisement

 

ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడీగా రమ్య‌కృష్ణ హీరోయిన్ గా న‌టించి అల‌రించింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మూడు పాత్ర‌ల‌లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. పోలీసు పాత్ర‌..దత్తాత్రేయ పాత్ర మ‌ర‌యు పృధ్వీ పాత్ర ఇక మూడు పాత్ర‌ల‌లోనూ చిరు డిఫ‌రెంట్ గా క‌నిపించి ప్రేక్షకుల‌ను అబ్బుర‌ప‌రిచారు.

Advertisement

 

అంతే కాకుండా మూడు పాత్ర‌ల‌కు మూడు ర‌కాలుగా గొంతులు మార్చి డ‌బ్బింగ్ చెప్ప‌డం సినిమాకు మ‌రో హైలెట్ గా నిలిచింది. సినిమాలో ముగ్గురిని చూపించాలి కాబ‌ట్టి రెండు పాత్ర‌ల కోసం డూప్ ల అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే చిరంజీవికి డూప్ గా ఆయ‌న వ‌ద్ద పీఏ గా ప‌నిచేస్తున్న సుబ్బారావు, న‌టుడు ప్ర‌సాద్ రావు న‌టించారు.

ALSO READ : పూజాహెగ్డే న‌టించిన మూడు సినిమాల్లో ఉన్న ఒకే కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..?

వారిద్ద‌రీ ఎత్తు బ‌రువు చిరంజీవికి స‌రిపోవ‌డంతో వాళ్ల‌ను ఈ సినిమా కోసం డూప్ లుగా తీసుకున్నారు. ఈ సినిమాకే కాకుండా మెగాస్టార్ కు డూప్ లుగా వీరిద్ద‌రూ మ‌రికొన్ని చిత్రాల‌లోనూ న‌టించారు. ఇక ముగ్గురు మొన‌గాళ్లు సినిమా బాక్స్ ఆఫీసు వ‌ద్ద భారీ విజ‌యం సొంతం చేసుకుంది. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వం మెగాస్టార్ టాలెంట్ తో వ‌చ్చిన ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

Visitors Are Also Reading