Home » పూజాహెగ్డే న‌టించిన మూడు సినిమాల్లో ఉన్న ఒకే కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..?

పూజాహెగ్డే న‌టించిన మూడు సినిమాల్లో ఉన్న ఒకే కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..?

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కించారు. భారీ బ‌డ్జెట్ తో యూవీక్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు జిల్ సినిమా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతే కాకుండా సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది. ఇక ఈ నెల 11న సినిమా విడుద‌ల కాగా మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. కానీ ప్ర‌భాస్ కు ఉన్న క్రేజ్ మ‌రియు సినిమాకు టీజ‌ర్ ట్రైల‌ర్ ల‌తో వ‌చ్చిన క్రేజ్ తో ఫ‌స్ట్ డే భారీ ఓపెనింగ్స్ వ‌చ్చాయి.

Advertisement

ALSO READ : పసివాడి ప్రాణం సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ పిల్లాడు ఎవరు ? ఇప్పుడెలా ఉన్నారంటే?

radhe shyam

అయితే ప్ర‌భాస్ హీరో కావ‌డంతో ఆశించిన మేర యాక్ష‌న్ సీన్లు మాస్ సీన్లు లేవ‌ని చాలా మంది ప్రేక్ష‌కులు డిస‌పాయింట్ అయ్యారు. ఇదిలా ఉండగా సినిమాలో ప్ర‌భాస్ పూజా హెగ్డేను చూడ‌గానే ఇష్ట‌ప‌డతాడు. అయితే మందుగా సీరియ‌స్ రిలేష‌న్ షిప్ కాకుండా ఫ్ల‌ర్ట్ చేయాల‌ని అనుకుంటాడు. ఆ త‌ర‌వాత మ‌రోసారి పూజాహెగ్డేను ట్రాఫిక్ లో క‌లుస్తాడు. అప్పుడు మ‌ళ్లీ ఎప్పుడు క‌లుస్తావంటూ పూజాహెగ్డేను అడుగుతాడు.

Advertisement

దాంతో రాసిపెట్టి ఉంటే మ‌ళ్లీ క‌లుస్తామ‌ని పూజాహెగ్డే చెబుతుంది. ఇక త‌ర‌వాత ప్ర‌భాస్ కు ఓ చిన్న‌ఫైట్ లో గాయం అవుతుంది. దాంతో ఆస్ప‌త్రికి వెళ‌తాడు. అక్క‌డే పూజాహెగ్డే ను ప్ర‌భాస్ మ‌రోసారి క‌లుస్తాడు. అయితే ఇదే విధంగా ఒకలైలా కోసం సినిమా సినిమాలో కూడా పూజా హెగ్డే నాగ‌చైత‌న్య గాయ‌ప‌డిన సంధ‌ర్భంలోనే క‌లుస్తుంది.

అదే విధంగా వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ముకుంద సినిమాలో కూడా జ‌రుగుతుంది. వ‌రుణ్ తేజ్ ఓ ఫైట్ లో గాయ‌ప‌డిన సమ‌యంలోనే మొద‌టి సారి పూజాహెగ్డేను క‌లుస్తాడు. అలా రాధేశ్యామ్, ముకుంద‌, ఒక‌లైలా కోసం సినిమాల‌లో కామ‌న్ పాయింట్ ఉండ‌టంతో గ‌మ‌నించిన నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

Also Read: స్వాతిముత్యం బుడ్డోడిని గుర్తుప‌ట్టారా…ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో…!

Visitors Are Also Reading