సీనియర్ హీరో మోహన్ బాబు తన పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ఎంతోమందికి ఉపయోగ పడ్డాను అని మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. తాను ఎంతో మందికి ఉపయోగపడ్డాను అని కానీ తనకు మాత్రం ఎవరూ ఉపయోగపడలేదు అని అన్నారు. అందరి చేతుల్లో మోసపోయాను అంటూ కామెంట్స్ చేశారు.
Advertisement
తన జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నా అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. ఏడేళ్ల పాటు తిండిలేక కారు షెడ్ లో గడిపినట్టు వెల్లడించారు. అంతే కాకుండా తనతో కొంతమంది రాజకీయ నేతలు ప్రచారం చేయించుకున్నారు అని తనకు మాత్రం ఏదీ చేయలేదని చెప్పారు. తన గురువు దాసరి నారయణరావుకు రుణపడి ఉంటా అని తెలిపారు.
Advertisement
ఇదిలా ఉంటే మోహన్ బాబు ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు. ఎన్నికల్లో వైసీపీ విజయం తర్వాత టిటిడి పదవి వస్తుందని ఆశించినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి పదవి రాకపోవడం తో మోహన్ బాబు నిరాశచెంది ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గతంలో కూడా మోహన్ బాబు టిడిపి తరపున ప్రచారం చేశారు. అంతే కాకుండా చంద్రబాబు కూడా తను మోసం చేశారు అంటూ గతంలో ప్రచారం చేశారు.