Home » “మ‌గ‌ధీర” సినిమాలో ఈ మిస్టేక్ గ‌మ‌నించారా…? మీకూ అదే డౌట్ వ‌చ్చిందా..?

“మ‌గ‌ధీర” సినిమాలో ఈ మిస్టేక్ గ‌మ‌నించారా…? మీకూ అదే డౌట్ వ‌చ్చిందా..?

by AJAY
Ad

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చిరుత సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు. అయితే మెగాస్టార్ త‌న‌యుడికి మొద‌టి సినిమా ఆశించిన మేర ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. ఈ సినిమా యావ‌రేజ్ గా నిల‌వ‌డంతో చిరంజీవి రెండో సినిమాను రాజ‌మౌళితో ప్లాన్ చేశారు. ఇక జ‌క్క‌న్న ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ కు సూప‌ర్ హిట్ ఇవ్వ‌డ‌మే కాకుండా ఇండియా మొత్తం త‌న పేరును గుర్తుండిపోయేలా చేశారు.

Advertisement

సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌గ‌ధీర బ్లాక్ బ‌స్టర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా త‌ర‌వాత కాజల్ రామ్ చ‌ర‌ణ్ స్టార్ లు గా మారిపోయారు. ఇక ఈ సినిమాలో ఒక్కో సన్నివేశం ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ముఖ్యంగా వంద‌మందితో యుద్దం చేసే సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇప్ప‌టికీ ఈ సినిమా టీవీలో వ‌స్తే మిస్ కాకుండా చూసే ప్రేక్ష‌కులు చాలా మందే ఉన్నారు. అయితే అలాంటి సినిమాలో ద‌ర్శుకుడు చిన్న లాజిక్ ను

Advertisement

కూడా మిస్ అయ్యాడు. సినిమాలో నాలుగు వంద‌ల ఏళ్ల క్రితం మ‌ర‌ణించిన హీరో హీరోయిన్ లు మ‌ళ్లీ పుడ‌తారు అన్న సంగతి తెలిసిందే. అయితే మొద‌టిసారి హీరో గుర్రం పై వెళుతున్నప్పుడు కాజల్ కు అత‌డి చేయి తాకుతుంది.

Magadheera

Magadheera

వెంట‌నే ఇద్ద‌రి మ‌ధ్య క‌రెంట్ పాస్ అవుతుంది. దాంతో హీరోకు పున‌ర్జ‌న్మ గుర్తుకు వ‌స్తుంది. అయితే ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ చాలా సార్లు క‌లుసుకుంటారు. కానీ క‌రెంట్ పాస్ అవ్వ‌దు. దాంతో ఇప్పుడు ఈ సీన్ ను వైరల్ చేస్తూ నెటిజ‌న్లు జోకులు వేస్తున్నారు. మ‌ళ్లీ క‌లుసుకున్నా కూడా ఎందుకు క‌రెంట్ పాస్ అవ్వ‌లేదు. ద‌ర్శ‌కుడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Visitors Are Also Reading