రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతిచిన్న వయసులోనే సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఎన్నో చిత్రాల్లో నటించి అవార్డులు, రివార్డులను సైతం సొంతం చేసుకుంది. చాలాకాలం పాటు సినిమాల్లో హీరోయిన్గా నటించిన రోజా కొద్ది రోజులకి సైడ్ క్యారెక్టర్లకి పరిమితమైంది. అంతేకాకుండా పలు షోలలో జడ్జిగా కూడా వ్యవహరించింది.
Advertisement
ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసింది. ఏపీలో మంత్రి పదవి రావడంతో సినిమాలకు, షోలకు గుడ్ బై చెప్పి తన పూర్తి సమయాన్ని రాజకీయాల్లోనే గడుపుతోంది. రోజా అంటే గిట్టనివారు చాలామంది తాను ఏం చేసినా కూడా తెగ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని రోజా జరుపుకున్నారు. తన కూతురితో కలిసి పబ్ కి వెళ్లి స్టెప్పులు వేశారు. ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటున్న రోజా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని తనకు నచ్చినట్టుగా జరుపుకున్నారు.
మంత్రిగా ఉంటూ ఇలా పబ్బుల్లో చిందులు వేయడమేంటని మండిపడుతున్నారు ఏపీ ప్రజలు. తనకు మంత్రి పదవి సెట్ కాదని, చిందులు వేయడమే తనకు ఇష్టమని కొంతమంది నెగటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. మంత్రి పదవిలో ఉన్నాక కాస్త ముందు వెనక ఆలోచించి ఏదైనా చేయాలి. అంతేకానీ తన పదవిని మర్చిపోయి చిన్నపిల్లలాగా చిందులు వేయడం కరెక్ట్ కాదని కొంతమంది భావిస్తున్నారు. ఇక ఈ వార్తలపై మంత్రి రోజా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!